హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..

హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఏఎస్ రావు నగర్ లోని శాంతి సురభి కాంప్లెక్స్ లో ఉన్న  ఏషియన్ బ్లడ్ సెంటర్ లో  ఆకస్మిక తనిఖీలు చేశారు  హైదరాబాద్  డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు. అనుమతి లేకుండా  ప్లేట్ లెట్స్ ,ప్యాక్ డ్ ఆర్బీసీ, ప్లాస్మా వంటి బ్లడ్ కాంపోనెంట్ లను తయారు చేసి రోగులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 2 బ్లడ్ బ్యాగులు, ఒక ప్లాస్మా బ్యాగ్, బిల్లు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇతర బ్లడ్ బ్యాంకుల (బ్లడ్ సెంటర్లు) నుంచి సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్లను అక్రమంగా సేకరించి అనధికార పద్ధతిలో రోగులకు సరఫరా చేస్తున్నట్టు బ్లడ్ సెంటర్ టెక్నీషియన్ జె.రవికుమార్  వెల్లడించారు.

 సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌, ప్యాక్‌డ్‌ ఆర్‌బీసీ, ప్లాస్మా తదితర బ్లడ్‌ కాంపోనెంట్స్‌ సిద్ధం చేసి పంపిణీ చేసేందుకు బ్లడ్‌ సెంటర్‌కు అధికారం లేదని.. రైడ్‌లో బ్లడ్‌బ్యాంక్‌లో బ్లడ్‌ కాంపోనెంట్స్‌ అక్రమంగా తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారని డీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T07:46:17Z dg43tfdfdgfd