లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇది వరకే విడదల చేసిన సంగతి తెలిసిందే. 'పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ'ల పేరుతోమేనిఫెస్టో విడుదల చేయగా.. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అధికారాన్ని కట్టబెట్టటంతో లోక్సభ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ వాటినే కొనసాగించింది. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను హస్తం పార్టీ చేర్చింది.
కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనుంది. రేపు (మే 3) ఉదయం 11 గంటలకు తెలంగాణ స్పెషల్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయనున్నారో సీఎం రేవంత్ వివరించనున్నారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, రహదారులు, రైల్వే లైన్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు దక్కనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల మంత్రం పనిచేయడంతో లోక్సభ స్పెషల్ మేనిఫెస్టోపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో తీవ్క ఉత్కంఠ నెలకొంది.