భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో దారుణం దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ భార్య భర్తపై వేడినీళ్లు పోసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన హేమంత్, రోహిణి దంపతులు. హేమంత్ స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తుండగా.. రోహిణి ప్రభుత్వ ఆసుపత్రిలోని చిల్డ్రన్స్ కేర్ విభాగంలో పనిచేస్తుంది.

అయితే గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగుతున్నాయి. బుధవారం (మార్చి 27) రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు ఒకర్నొకరు తీవ్రంగా దూషించుకున్నారు. విచక్షణ కోల్పోయిన భార్య.. పొయ్యిమీద సలసల కాగుతున్న వేడి నీళ్లను భర్తపై పోసింది. ఈ ఘటనలో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం హేమంత్ కన్నుమూశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్త మృతికి కారణమైన రోహిణిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T08:59:10Z dg43tfdfdgfd