మందుబాబులకు మరోసారి బ్యాడ్‌న్యూస్.. ఆ 3 రోజులు వైన్స్, బార్లు బంద్

ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మందుబాబులు వైన్స్‌ ముందు బారులు తీరుతున్నారు. పైనుంచి వస్తున్న ఎండ వేడికి.. చల్ల చల్లని బీర్లు తాగి వేసవి తాపాన్ని తీర్చుకుందామనుకుంటే.. ఆ బీర్లు కూడా దొరకటం లేదని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినిపించారు అధికారులు. రెండు రోజుల పాటు డ్రై డేగా ప్రకటించారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకోగా.. మే 13న పోలింగ్ జరగనుంది. ఆరోజు లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నికకు.. పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పోలింగ్ నిరాటకంగా జరిగేందుకు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి.. పోలింగ్ రోజైన మే 13న సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాకుండా.. ఎన్నికల ఫలితాల వెల్లడయ్యే రోజు జూన్ 4న కూడా వైన్ షాపులు మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైన్ షాపులతో పాటుగా వివిధ జిల్లాలు, నగరాల్లో బార్లు, కల్లు కాపౌండ్ కూడా మూసేయనున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T13:43:48Z dg43tfdfdgfd