వాటిని అనుమతించట్లేదు.. తీహార్ జైలు అధికారుల తీరుపై కవిత సీరియస్, కోర్టులో పిటిషన్

Kalvakuntla Kavitha Petition: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా జ్యూడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కాగా.. తీహార్ జైలు అధికారుల తీరును ఖండిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. జైలు అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ.. గురువారం రోజు రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సమయంలోనే.. ఇంటి భోజనం, బెడ్ షీట్స్, దుప్పట్లు, పెన్నులు, పేపర్లు తెప్పించుకుంనేందుకు కవితకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే.. జైలు అధికారులు మాత్రం అవేవీ అనుమతించడం లేదంటూ కవిత కోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే.. ఇంటి భోజనం సహా మిగతా సదుపాయాలన్ని కల్పించేలా జైలు అధికారులను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేస్తూ కవిత పిటిషన్‌ పేర్కొంది.

అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ నిమిత్తం కవితను అరెస్టు చేసిన ఈడీ.. ముందుగా కోర్టు అనుమతితో 7 రోజుల పాటు రిమాండ్‌లోకి తీసుకోగా.. ఆ తర్వాత మరో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అనంతరం కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో.. ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అయితే.. కవితకు హైబీపీ ఉన్న కారణంగా జైలులో.. కవితకు కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు కోర్టు అనుమతించింది.

ఇంటి భోజనంతో పాటు.. మెడిసిన్స్, పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, బెడ్ షీట్, బ్లాంకెట్లు ఇంటి నుంచి తెప్పించుకునేందుకు కవితకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు.. ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే.. ఈ సౌకర్యాలేవీ జైలు అధికారులు తనకు కల్పించడం లేదని కవిత కోర్టులో పిటిషన్ వేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కవిత పిటిషన్‌పై స్పందించిన కోర్టు.. ఎల్లుండి (మార్చి 30) విచారించనున్నట్టు వెల్లడించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T16:59:58Z dg43tfdfdgfd