ఈ ప్రముఖ క్షేత్రానికి దర్శనానికై వస్తున్నారా.. ఇక ఇవి తీసుకురావద్దు !
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయానికి నిరంతరం భక్తులు స్వామి వారి దర్శనానికి అధికంగా వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా వచ్చే భక్తులు ఇప్పటి నుండి ఈ నిబంధన పాటించి సహకరించాలని ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఆలయానికి ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు తీసుకువచ్చారో.. ఇక జరిమానాలు తప్పవు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ నిబంధన పాటించక పోతే చర్యలు తీసుకోనున్నారు ఆలయ అధికారులు. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం అధికారులు సిద్దం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్రపరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. కాగా స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు మొదలైనవారంతా ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి బదులు కాగితపు కవర్లు, గుడ్డ సంచులు, వస్త్రంతో రూపొందించిన సంచులు, జ్యూట్ బ్యాగులు మొదలైనవాటిని వినియోగించాలని కోరారు. అదేవిధంగా ప్లాస్టిక్ మంచినీటి సీసాలకు బదులుగా మట్టి, స్టీలు, రాగి సీసాలను వినియోగించుకోవచ్చన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధ్వర్యంలో పలుచోట్ల ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆలయ పరిసరాలలో పారిశుద్ధ్యం పై సైతం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తాము తనిఖీలు నిర్వహించి భక్తులను చైతన్య పరుస్తున్నామని, ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. మున్ముందు జరిమానాల పర్వం కొనసాగిస్తామన్నారు. స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు, సత్రాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ నిషేధంపై దేవస్థానానికి సహకరించాలని కోరారు.
2024-05-01T16:45:36Z
ఆ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాలకు భారీ ఆదాయం..
ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పవిత్ర సమాధి, స్వామి వారి బృందావనం ఈ ప్రాంతంలో ఉండటంతో మంత్రాలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే నేటికీ లక్షలాది మంది భక్తులు రాయల దర్శనం కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.... శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,71,83,973 వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. అధికారుల, భక్తుల సమక్షంలో ఆదాయాన్ని లెక్కించారు. ఇందులో కరెన్సీ అధిక మెుత్తంలో వచ్చిందన్నారు. బంగారం 41 గ్రాములు, వెండి 1290 గ్రాములను భక్తులు సమర్పించారని వెల్లడించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలసిన అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహాస్వామి మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్ని సంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ రూపంలోనూ అవతరించడంతోనే ఇది మహిమ గల పుణ్యక్షేత్రమని భక్తుల నమ్మకం. అందుకే నిత్యం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇటీవల అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియడంతో స్వామి వారికి భక్తులు కానుకల రూపంలో హుండీకి సమర్పించిన ఆదాయాన్ని ఆలయం అధికారులు లెక్కించారు. స్వామి వారికి నగదు రూపంలో వచ్చిన కానుకల విలువ రూ.42,54,783(నలభై రెండు లక్షల ఏభై నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు).....అలాగే పారువేట లో స్వామి వారికి వచ్చిన కానుకల విలువ రూ.7,96,225( ఏడూ లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు) బంగారు ఆభరణాలు ఎగువ అహోబిలం - 135 గ్రాములుదిగువ అహోబిలం-105 గ్రాములుపారువేట- 3 గ్రాములు,వెండి ఎగువ అహోబిలం- 4 కిలోల 400 గ్రాములుదిగువ అహోబిలం- 2 కిలోల 730 గ్రాముల పారువేట - 190 గ్రాములు వచ్చినట్లు తెలిపారు....
2024-05-01T15:30:06Z