భువనగిరి బీజేపీలో గ్రూపు రాజకీయాలు
యాదాద్రి, వెలుగు : జాతీయ స్థాయిలో మోదీ ప్రభావం, రామ మందిర అంశంతో బీజేపీ ఊపుమీద ఉండగా భువనగిరిలో మాత్రం డీలా పడుతోంది. తెలంగాణలో గెలిచే సీట్ల లో భువనగిరి కూడా ఒకటని బీజేపీ భావించగా, గ్రూపు రాజకీయాలు ఆ పార్టీ కొంప ముంచేలా ఉన్నాయి. ఎన్నికల టైంలో లీడర్లంతా ఎవరికి వారే అన్నట్టుగా సాగుతున్నారు. ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. దీంతో పార్టీ కేడర్ డీలా పడిపోతోంది.
సీనియర్ల అలక..ప్రచారానికి దూరం
భువనగిరి లోక్సభ సీటును సీనియర్ లీడర్లు గంగిడి మనోహర్రెడ్డి, యాదాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు సహా మరికొందరు ఆశించారు. అయితే, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్కు టికెట్లభించింది. అప్పటి నుంచి టికెట్ఆశించిన వారితో పాటు మరికొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. దీంతో శ్యాంసుందర్రావు ప్రచారం వైపు కన్నెత్తి చూడలేదు. మరో లీడర్ గంగిడి మనోహర్ రెడ్డి ఒకటి రెండు సార్లు వచ్చినా నామ్కే వాస్తే అన్నట్టుగానే వ్యవహరించారు.
.ఇప్పుడాయన ఇక్కడి ఎన్నికలను పక్కన పెట్టి కరీంనగర్ ప్రచారంలో మునిగిపోయారు. మరో కీలక నేత సంకినేని వెంకటేశ్వర్రావు, గూడూరు నారాయణరెడ్డి కూడా క్యాంపెయిన్లో పాల్గొనడం లేదు. బూర నర్సయ్య గౌడ్ నామినేషన్సందర్భంగా ఈ నెల 23న నిర్వహించిన ర్యాలీకి సరిగ్గా జన సమీకరణ చేయలేదన్న అసంతృప్తి కూడా పార్టీలో నెలకొంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్వచ్చిన ర్యాలీకి మరీ తక్కువగా జనం రావడంపై పెదవి విరుస్తున్నారు. మరోవైపు బూర నర్సయ్య అసంతృప్త సీనియర్లతో సత్సంబంధాలు నెరిపే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలున్నాయి. సమావేశాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీనియర్ల ఫొటోలను విస్మరించడంపై కూడా చర్చ నడుస్తోంది.
క్యాస్ట్ప్రభావం
బూర నర్సయ్య గౌడ్ను అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత పార్టీలో క్యాస్ట్ ప్రభావం ఎక్కువైందంటున్నారు. ఆయన చుట్టూ ఒకటే కులానికి చెందిన వారుంటున్నారని చెబుతున్నారు. దీంతో పార్టీలోని ఇతర కులాలకు చెందిన క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కులానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతర కులాల వారు దూరమవుతారని, ఎన్నికలపై ఇది ప్రభావం పడి దెబ్బతింటామని వాపోతున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-26T05:51:11Z dg43tfdfdgfd