సెంకండ్ ఫెజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు

సెంకండ్ ఫెజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు

దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. కర్ణాటకలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ బూత్ లు ఓపెన్ చేయగా.. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 

వారిలో కొందరు సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఐకాన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, నటుడు ప్రకాష్ రాజ్ వారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-26T04:35:58Z dg43tfdfdgfd