రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వస్తున్న వ్యక్తి ఫ్లై ఓవర్ పై అదుపుతప్పి ఫూట్ పాత్ పై ఉన్న పూలకుండి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని జాఫర్ గూడెంకు చెందిన వరాల శ్రీనివాస్ జనగామ పోలీస్ స్టేషన్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమానికి వెళ్లొస్తున్న శ్రీనివాస్ జనగామ ఫ్లై ఓవర్ పైకి బైక్ అదుపు తప్పింది.
పక్కనే ఉన్న పూలకుండిని ఢీ కొన్నాడు. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు హోం గార్డుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. ఘటనపై పోలీసులు దిగ్రాంతి వ్యక్తం చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-26T03:05:43Z dg43tfdfdgfd