VIKARABAD: కారులో అనుమానంగా 2 బాక్సులు.. చెక్ చేసి షాక్‌కు గురైన పోలీసులు

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణలోనూ ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చెకింగ్‌లు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంపిణీ చేసే ఆస్కారం ఉండటంతో చెక్‌ పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. కోడ్ అమల్లో ఉండగా.. రూ. 50 వేల కంటే ఎక్కువగా డబ్బు తీసుకెళ్లకూడదు. తీసుకెళ్తే సరైన పత్రాలు ఉండాలి లేదంటే పోలీసులు వాటిని సీజ్ చేస్తారు.

తాజాగా.. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలంలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. మండలం కేంద్రంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేసే సమయంలో ఓ కారు నుంచి రూ. 1.50 కోట్ల నగదును సీజ్ చేశారు. శుక్రవారం పులిమామిడి క్రాస్ రోడ్స్, నవాబ్ పేట్ మెయిన్ రోడ్డులో నవాబ్ పేట్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. TS 09 EQ 0004 నెంబర్ గల ఇన్నోవా కారులో ఓ రెండు పెట్టెలు అనుమానస్పదంగా కనిపించాయి. ఏంటా అని చెక్ చేయగా.. పోలీసులు షాక్‌కు గురయ్యారు. పెట్టెల నిండా నోట్ల కట్టలే. వాటిని లెక్కించగా.. మెుత్తం రూ. 1.50 కోట్లుగా తేలింది.

ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాడు డబ్బుకు సంబంధఇంచిన సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. కారులో డ్రైవర్‌తోపాటు రంగారెడ్డి జిల్లా మోఖిలకు చెందిన స్థిరాస్తి వ్యాపారి రవీందర్‌ రావు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T06:37:58Z dg43tfdfdgfd