ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్

ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్

కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అరెస్ట్ అయ్యాడు.  గత కొద్ది నెలలుగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ, పేద ప్రజలకు అమ్మి మోసం చేస్తున్న  భూ కబ్జాదారుడు, రౌడి షీటర్ షేక్ అభిద్ ను ఏప్రిల్ 24వ తేదీ బుధవారం జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

ఇప్పటికే అబిద్ పై 16కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు అభిద్.  ఎట్టకేలకుఈ రోజు అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T16:15:09Z dg43tfdfdgfd