ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని చెప్పారు. త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని తెలిపారు. ఊహాగానాలుతో దర్యాప్తు ను ఇబ్బంది పరుస్తున్నారని తెలిపారు. రాజకీయ నేతల ప్రమేయం పై దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ప్రభాకర్ రావు ను పట్టుకోవడం లేదనే వార్త అవాస్తవమని చెప్పారు. 

హైదరాబాద్ లో సీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.  దర్యాప్తు పార దర్శకంగా జరుగుతుందని ట్యాపింగ్ కేసులో ఎంతటి వాళ్ళ నైనా వదిలిపెట్టేది లేదని చెప్పారు. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-26T08:21:36Z dg43tfdfdgfd