Trending:


తెలంగాణలో గాలి వాన బీభత్సం

తెలంగాణలో గాలి వాన బీభత్సం ఉరుములు, మెరుపులతో వడగండ్లు  వర్షం ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో చల్లబడ్డ వాతావరణం  ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు.. ఎగిరిపడ్డ ఇండ్ల పైకప్పులు ఫస్ట్​ టైమ్ 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత వెలుగు, నెట్ వర్క్: రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో మండుతున్న ఎండల నుంచి పలు జిల్లాలకు కాస్త రిలీఫ్ దొరికినట్టయి...


ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన చేరికలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లా వైరా క్యాంపు ఆఫీసులో ఆందోళన టెంట్లు కూల్చి, కరెంట్​ఫ్యూజులు పీకి నిరసన సర్ది చెప్పిన ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు వైరా, వెలుగు : కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమికి పనిచేసిన బీఆర్ఎస్ లీడర్లను ఎలా పార్టీలోకి తీసుకుంటారంటూ ఖమ్మం...


దంతెవాడలో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు

దంతెవాడలో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు భద్రాచలం, వెలుగు :  ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్​రాయ్​ఎదుట ఆదివారం35 మంది మావోయిస్టులు  లొంగిపోయారు. దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని బైరంగఢ్, మలంగిర్, కటేకల్యాణ్ ఏరియా కమిటీల్లో పనిచేసే దళ సభ్యులు ఇందులో ఉన్నారు. లొంగిపోయిన వారిలో ముగ్గురిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని, జనజ...


నేటి నుంచి అకౌంట్లలోకి డబ్బులు!

రైతులకు అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? డబుల్ బెనిఫిట్ లభించనుంది. అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి. ఇంతకీ ఏ డబ్బులు వస్తాయి? ఎప్పుడు బ్యాంక్ అకౌంట్లలో పడతాయి? వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా (రైతు బంధు) పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనుంద ని తెలుస్తోంది. నేటి నుంచి ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ పెండింగ్ బకాయిలను జమ చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. పెండింగ్‌లో డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడనున్నాయి. 3 రోజుల పాటు దాదాపు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుందని తెలుస్తోంది. ఇందు కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తోందని నివేదికలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ మేరకు మొత్తం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరో వైపు రైతులకు ఇంకో బెనిఫిట్ కూడా లభించబోతోంది. ఇటీవల కాలంలో అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీని వల్ల చాలా మంది రైతులకు పంట నష్టం జరిగింది. దీని వల్ల వారిపై చాలా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారికి ఊరట లభించనుంది. అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులకు కూడా నేటి నుంచి నష్ట పరిహారం పంపిణీ చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎకరాకు రూ. 10 వేల చొప్పున డబ్బుల అన్నదాతలకు లభించనుంది. అంటే ఇలా రైతులు డబుల్ బెనిఫిట్ లభించనుందని చెప్పుకోవచ్చు. మరో వైపు అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ స్కీమ్ కింద వచ్చే నెల చివరిలో లేదా జూలై నెల తొలి వారంలో డబ్బులు రావొచ్చు. బ్యాంక్ అకౌంట్లలో ఈ మొత్తం జమ కావొచ్చు. పలు నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మోదీ సర్కార్ ఇప్పటి వరకు రైతులకు 16 విడతల డబ్బులను అందించింది. అంటే నేరుగానే రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 32 వేలు పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరో విడత డబ్బులు వస్తే.. అప్పుడు మొత్తంగా అన్నదాతలకు రూ. 34 వేలు లభించినట్లు అవుతుంది. కాగా పీఎం కిసాన్ రైతులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అన్నదాతలు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే మాత్రం డబ్బులు రాకుండా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు ఇంకా ఇకేవైసీ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. తర్వాత ఇబ్బంది ఉండదు. డబ్బులు సులభంగానే అకౌంట్లోకి వచ్చి పడతాయి.


ED Recovers Huge Amount: ఎన్నికల వేళ ఈడీ మరో సంచలనం.. జార్ఖండ్ మంత్రి సహాయకుడికి ఇంట్లో గుట్టల కొద్దీ భారీగా నగదు స్వాధీనం..

ED Recovers Huge Amount: సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీగా నగదు స్వాధీనం స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో గుట్టల కొద్దీ నగదు పట్టుబడటం ఇపుడు జార్ఖండ్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది.


ఆశలు రేకెత్తిస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో

ఆశలు రేకెత్తిస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో ఐదు పంచాయతీల విలీనం, బయ్యారం ఉక్కుపరిశ్రమ, మేడారం జాతరకు జాతీయహోదా భద్రాచలం, వెలుగు : లోక్​సభ ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో మహబూబ్​బాద్​ నియోజకవర్గంలో ఆశలు రేకెత్తిస్తోంది. ఏళ్లనాటి సమస్యల పరిష్కారానికి తమది హామీ అంటూ ప్రకటించిన తీరు ఊపు తెచ్చింది. పదేళ్లుగా భద్రాచలం నుంచి ఏపీలో విలీనమ...


వేములవాడలో కూలిన పురాతన చెట్టు

వేములవాడలో కూలిన పురాతన చెట్టు వేములవాడ, వెలుగు:  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ  సమీపంలోని నటరాజ్​ విగ్రహం వద్ద పురాతన చెట్టు ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భక్తులకు చెందిన రెండు కార్లు, డాగ్ స్క్వాడ్‌‌ వాహనం దెబ్బతిన్నాయి. ©️ VIL Media Pvt Ltd.


చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి

చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్​కు సీఎం రేవంత్ రెడ్డి సూచన జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతుభరోసా,  ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు గద్వాల జన జాతర సభలో సీఎం ప్రసంగం గద్వాల, వెలుగు: ఒక్కసారి చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కిత...


Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాల్లో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కూలిపనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది.


వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : ఆరెపల్లి మోహన్​

వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : ఆరెపల్లి మోహన్​ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని,  కాంగ్రెస్​ గెలిచి రాహుల్​గాంధీ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు కొనసాగుతాయని మానకొండూర్​ మాజీ  ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్​ అన్నారు.  పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పదేళ...


గుడిలో దేవత విగ్రహాలు ఉండవు.. కానీ కోరినవన్నీ జరుగుతాయి! ఎక్కడంటే..

500 ఏళ్లచరిత్ర గల సుంకులమ్మ గుడి ఇది. ఇక్కడ పూర్వం నుంచి అనేక రకాల పూజ కార్యక్రమాలు చేస్తు వస్తున్నారు గ్రామ పెద్దలు. ఈ అమ్మవారి విశిష్టత ఏమిటంటే.. కోరిన కోరికలు తీర్చే మహ తల్లిగా భక్తులు కొలుస్తారు. విశ్వాసంతో భక్తులు అడిగిన కోరికలు తీర్చటంతో వరాలు ఇచ్చే దేవతగా పేరు ప్రతిష్టలు పొందారు. అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా... ఈ దేవత విశిష్టత గురించి లోకల్ 18 ప్రతినిధి వివరిస్తారు.నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామం అది. ఇక్కడ...


అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్ జైపూర్, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో అటవీ, ప్లాంటేషన్ ఏరియాల్లో వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ అడవుల ఉపయోగాలను ...


పైకి పొత్తు.. లోపల దూరం.. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా?

ఏ కాపురమైనా కలకాలం కొనసాగాలంటే.. ఆ కుటుంబంలోని సభ్యుల మధ్య సఖ్యత ఉండాలి. ఇదే రూల్ కూటములకూ వర్తిస్తుంది. 2014లో టీడీపీ+బీజేపీ+జనసేన కూటమిగా మారి.. విజయం సాధించి.. ఏపీలో అధికారంలోకి వచ్చాయి. కానీ.. 2019కి సీన్ మారింది. మూడు పార్టీలూ.. వేటికవే దారి వెతుక్కున్నాయి. దాంతో వైసీపీకి భారీ మెజార్టీ దక్కింది. ఇప్పుడు మళ్లీ కూటమి కట్టినా, 2019లో చేసిన పొరపాట్లు ఇప్పుడు ఆ పార్టీలను వెంటాడుతున్నాయి. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు.. ఇద్దరూ బీజేపీపై...


ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన

Ambati Rambabu Son In Law Episode: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ఓటేయవద్దని మంత్రి రెండో అల్లుడు, డాక్టర్‌ గౌతమ్‌ ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి అల్లుడు కావడం తన దురదృష్టమంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కొందరు కుట్రపన్ని తన అల్లుడ్ని రెచ్చగొట్టి ఇలా చేశారని ఆరోపించారు. గౌతమ్‌కు తన కూతురితో నాలుగేళ్ల విభేదాలు ఉన్నాయని.. ప్రస్తుతం తన సంరక్షణలోనే...


అల్‌‌ జజీరా వార్తా సంస్థపై ఇజ్రాయెల్ నిషేధం

అల్ జజీరా గాజా బ్యూరో చీఫ్ వేల్ అల్ దహ్‌దౌ కుమారుడు హంజా అల్ దహ్‌దోతో పాటు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. జర్నలిస్టులను తాము టార్గెట్ చేయట్లేదంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది.


నిరుద్యోగులకు అలర్ట్... ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఇవే..!

ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన కొన్ని రిక్రూట్‌మెంట్స్‌కు అప్లై చేసుకునే గడువు త్వరలో ముగియనుంది. ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సినవి ఏవో చూద్దాం.* ఐటీఐ అప్రెంటీస్‌షిప్రక్షణ రంగంలో కీలక సంస్థ డీఆర్‌డీవో ఆధ్వర్వంలో పనిచేసే డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (DMRL)-హైదరాబాద్‌‌లో ఐటీఐ అప్రెంటీస్‌షిప్ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ డిపార్ట్‌మెంట్‌లలో ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్,...


నిర్లక్ష్యం వేలాడుతోంది

నిర్లక్ష్యం వేలాడుతోంది బేగంపేట ఎంఎంటీఎస్  రైల్వే స్టేషన్ సమీపంలో మూల మలుపు వద్ద  కేబుల్స్ తెగి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. వారం రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది.  ఆ రోడ్డుపై నుంచి వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినా అలాగే వెళ్లక తప్పని పరిస్థితి ఉంది.  పైపులు వేలాడుతూ ఉన్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏదైనా అనుకోని ప్రమాద...


Cool News: తెలంగాణ ప్రజలకు భారీ ఉపశమనం.. ఐదు రోజులు వర్షాలు

IMD Report Cool News To Telangana: పాత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండల నుంచి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తన నివేదికలో వెల్లడించింది.


టీ20 ప్రపంచకప్‌పై దాడిచేస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాదుల బెదిరింపులు

Terrorist threats on T20 World Cup 2024 : యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికా వేదిక‌లుగా వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానుంది. అయితే, క్రికెట్ ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తూ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే హఠాత్తుగా ఒక వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. జూన్ నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 సందర్భంగా క్రికెట్ వెస్టిండీస్‌కు తీవ్రవాద దాడి హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయి. ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్...


సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ

సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ మంచిర్యాల: విశాఖ, కాక ట్రస్ట్ ల పేరుతో పెద్దపల్లి పార్లమెంట్ లో అనేక సేవలు చేశామని చెప్పారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.   సింగరేణి రూ.450 కోట్ల నష్టంలో ఉన్నప్పుడు వడ్డీలేని రుణాన్ని తీసుకువచ్చి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి అని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క ...


ఫోన్ ట్యాపింగ్​ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్​ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్ వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ట్యాపింగ్ పైసలతో ఓట్లను కొనేందుకు సిద్ధమైన్రు   దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దొంగలు కేసీఆర్, కేటీఆర్ లేనని..కేసీఆర్ చెబితేనే ఫోన్లను ట్యాప్ చేశామన...


దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు

దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు తమిళనాడు రైల్వే ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులు అవసరాలకు వాడుకుందామనుకుంటే చుక్క నీరు కూడా రావడం లేదు. చెన్నై సెంట్రల్, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరిన రెండు మూడు గంటల్లోనే రైళ్లు నీళ్లు పూర్తిగా అయిపోయి నీటి కోరత ఏర్పడుతుంది. ప...


పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 5,233 మంది

పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 5,233 మంది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 5,233మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆదివారం 1,914  మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్టు చెప్పారు. హోమ్ ఓటింగ్ లో  531 మం...


భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట

భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమ్మర్ హాలీడేస్ కు తోడు సండే కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తులతో నారసింహుడి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వచ్చింది. రద్దీ...


ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి

ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి మహిళా కాంగ్రెస్ నేతల డిమాండ్ హైదరాబాద్, వెలుగు: సెక్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం ముందు రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగ...


జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు

జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాల్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. మే 6వ తేదీ సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. వీరేంద్ర రామ్ కేసులో జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నివాసంలో భారీ...


ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా

ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాట్లాడిన అమిత్ షా..  ముస్లీంలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తన  వీడియో మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికా కాంగ్రెస్ కుట్ర చేస...


మండు వేసవిలో చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు


అంబానీ, ఆదానీ జేబులు నింపుతున్న మోదీ: జస్టిస్ చంద్ర కుమార్

అంబానీ, ఆదానీ జేబులు నింపుతున్న మోదీ: జస్టిస్ చంద్ర కుమార్ కరీంనగర్, వెలుగు: ప్రధాని మోదీ గత పదేళ్లలో మన జేబులు కత్తిరిస్తూ తన మిత్రులైన అంబానీ, అదానీ జేబులు నింపారని హైకోర్టు రిటైర్డ్‌‌‌‌ జడ్జి చంద్రకుమార్‌‌‌‌ ఆరోపించారు. దేశంలోని 2 శాతం వ్యాపారులకు లాభం చేకూరుస్తూ, హిందువులను ఉద్ధరిస్తున్నానని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌‌‌‌లోని...


‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ క్లోరోపిక్రిన్‌ను తన శత్రువులపై రష్యా ప్రయోగిస్తోందా?

ఈ రసాయనిక పదార్థాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాడారు. ‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ అని ఓపీసీడబ్ల్యూ పేర్కొంది.


ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : కె. లక్ష్మణ్

ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : కె. లక్ష్మణ్ ముషీరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని, ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ముషీరాబాద్, గాంధీనగర్ డివిజన్ సబర్మతి నగర్, అరుంధతి నగర్, దోబిఘాట్, వీవీ గిరినగర్, ఆంధ్ర చౌరస్తాతో పాటు పలు బస్త...


కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్

కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో మత్తు పదార్థంను పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థంను తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6వ తేదీ సోమవారం ఉదయం భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో ఓ కారులో తరలిస్తున్న కల్లులో వినియోగించే 248 గ్రాముల అల్ప్రాజోలం మత్తు పదార్థంను గుర్త...


కేసీఆర్‌‌ సభ రోజే.. బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్

కేసీఆర్‌‌ సభ రోజే.. బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్ కాంగ్రెస్‌లోకి 400 మంది కార్యకర్తలు వీణవంక, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని బస చేశారు. అనంతరం ఆదివారం వీణవంక ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఇదే టైంలో మండల కేంద్రంతో పాటు చల్లూరు గ్రామం నుంచి సుమారు 400 మంది బీఆర్ఎస్ నాయకులు, కార...


ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 74 కాలేజీల్లో 33, 630 సీట్లు డిచ్ పల్లి, వెలుగు : తెలంగాణలో 2024–25 దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాగా..  నేటి నుంచి  తెలంగాణ విశ్వవిద్యాలయంలో తొలి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెయూ అధికారిక లెక్కల ప్రకారం.. యూనివర్సిటీ పరిధిలో 74 డిగ్రీ కాలేజీలు ఉండగా.. 33,630 సీట్లు...


మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్

మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గోదావరిఖని, వెలుగు: దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలని, ఏఐటీయూసీ బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, సీన...


మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు

మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు ఇంఫాల్: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని ఏడాది అయింది. ఇప్పటి వరకూ హింస కారణంగా 200 మంది చనిపోయారు. వేల మంది తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. 50 వేల మంది బాధితులు ఇంకా శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుకీలు పొ...


Rasi Phalalu 6-5-2024: వారికి బంధువుల సపోర్ట్‌ లభిస్తుంది

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 6వ తేదీ, సోమవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):బ్యాలెన్స్‌డ్‌ ఎన్విరాన్‌మెంట్‌, సామరస్యపూర్వక సంబంధాలు, రొమాంటిక్‌ మూమెంట్స్‌ పెంపొందించడానికి ఇంట్లో స్ట్రక్చర్‌, డిసిప్లైన్‌ మెయింటైన్‌ చేయండి. వృత్తిపరమైన స్థిరత్వం, పనుల్లో విజయాన్ని కొనసాగిస్తూ బంధువులతో ఆనందకరమైన సమావేశాలను ఆస్వాదించండి. అంకితభావంతో, ఏకాగ్రతతో ఉండండి. వర్క్‌లో మీకు మీరు పెట్టుకున్న పరిమితుల నుంచి విముక్తి పొందండి. కొత్త వ్యాపార అవకాశాలను స్వీకరించండి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. విభేదాలను నివారించడానికి, శారీరక, మానసిక స్థితిస్థాపకతను పెంపొందించడానికి దౌత్యాన్ని కొనసాగించండి. కుటుంబ ఒత్తిడులను ఎదుర్కొంటే పెద్దల నుంచి గైడెన్స్‌ పొందండి. అదృష్ట సంఖ్య: 9. అదృష్ట రంగు: ఎరుపు. అదృష్ట రత్నం: రూబీ. వృషభం (Taurus):ఇంట్లో సామరస్యం, సంతృప్తిని అనుభవించండి. లోతైన భావోద్వేగ బంధాలను పెంపొందించుకోండి. బంధువుల నుంచి సపోర్ట్‌ పొందండి. క్లియ్‌ కమ్యూనికేషన్, ఇన్నోవేటివ్‌ థింకింగ్‌ ద్వారా పనిలో గుర్తింపు పొందుతారు. సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించవచ్చు, ఆర్థిక భద్రత కోసం కృషి చేయండి. స్నేహితుడు మంచి పెట్టుబడుల సలహాలు చేస్తాడు. మంచి ఆరోగ్యం, శక్తిని ఆస్వాదించండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న దాతృత్వాన్ని గౌరవించండి. అదృష్ట సంఖ్య: 4. అదృష్ట రంగు: ఆకుపచ్చ. అదృష్ట రత్నం: తెల్ల నీలమణి. మిథునం (Gemini):రొమాంటిక్‌ అడ్వెంచర్‌లు, కొత్త కనెక్షన్‌లను అన్వేషించేటప్పుడు మీ కుటుంబంలోని ఎమోషనల్‌ ఛాలెంజెస్‌ని పరిష్కరించండి. ముఖ్యంగా బంధువులతో అపార్థాలు రాకుండా సహృద్భావాన్ని కొనసాగించండి. కెరీర్‌లో వృద్ధి కోసం ఇంటలెక్చువల్‌ క్యూరియాసిటీ, శ్రద్ధను ప్రదర్శించండి. పెట్టుబడులకు సంబంధించి నిపుణుల సలహాలు కోరండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆఫీసు రాజకీయాల మధ్య న్యూట్రల్‌గా ఉండండి. హీలింగ్‌, ఫర్గివ్‌నెస్‌ కోసం సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 7. అదృష్ట రంగు: పసుపు. అదృష్ట రత్నం: సిట్రిన్. కర్కాటకం (Cancer):ఈ రోజు స్థిరమైన, కమిటెడ్‌ రిలేషన్‌ పెంపొందించుకోండి. ఆత్మపరిశీలనను స్వీకరించండి, ఇంట్లో సంతృప్తిని కనుగొనండి. బంధువులతో సరిహద్దులను ఏర్పరచుకోండి. మీ కెరీర్‌లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌, క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి. వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో అభివృద్ధి, సంతృప్తి కోసం అవకాశాలను వెతకండి. ఊహించని ఆర్థిక లాభాలు అందుతాయి. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్‌లు, రివార్డ్‌లను బ్యాలెన్స్‌ చేయండి. ముందుకు సాగడానికి మీ శక్తిని బలోపేతం చేయండి, సంఘర్షణలను పరిష్కరించుకోండి. అదృష్ట సంఖ్య: 3. అదృష్ట రంగు: వెండి. అదృష్ట రత్నం: ఒనిక్స్. సింహం (Leo):గృహ విషయాల్లో సహనం, పట్టుదల చూపుతారు. ఈ రోజు ప్రేమ, సంతానోత్పత్తి, రిలేషన్‌లు కూడా ఎదురవుతాయి. మీ స్నేహితుడికి మద్దతు ఇవ్వాల్సిన, రక్షించాల్సిన అవసరం ఉండవచ్చు. ఈ రోజు మీ నాయకత్వాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్‌ వెంచర్ల కోసం వ్యూహాత్మక ప్రణాళికను ఉపయోగించండి. పెట్టుబడులపై ఆర్థిక లాభాలను ఆశించండి. ఔషధాలపై తక్కువ ఆధారపడండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. కోపాన్ని విడిచిపెట్టి, శాంతింపజేయడానికి క్షమాపణ కోరండి. అదృష్ట సంఖ్య: 8. అదృష్ట రంగు: బంగారం. అదృష్ట రత్నం: పచ్చ కన్య (Virgo):ఇంట్లో ప్రాక్టికాలిటీ, స్థిరత్వంపై దృష్టి పెట్టండి. సవాలు చేసే వ్యక్తుల నుంచి ఎమోషనల్ డిటాచ్‌మెంట్ కొనసాగిస్తూ, ఉద్వేగభరితమైన రిలేషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. కెరీర్ అభివృద్ధికి, సహోద్యోగులతో సంబంధాలను పెంపొందించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. వ్యాపారంలో అడ్డంకులను అధిగమించి, ఆర్థిక నిర్ణయాల కోసం నిపుణుల సలహాలను పొందండి. కుటుంబ విలువలను నిలబెట్టేటప్పుడు సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌, సెల్ఫ్‌ అభ్యసించండి. అదృష్ట సంఖ్య: 5. అదృష్ట రంగు: నీలం. అదృష్ట రత్నం: మూన్‌స్టోన్‌. తుల (Libra):ఇంటి విషయాల్లో బ్యాలెన్స్‌ కోసం కృషి చేయండి. కొత్త ప్రేమ, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ స్వీకరించండి. సహోద్యోగులతో సరిహద్దులను నిర్వహించండి. కెరీర్ విజయం కోసం శక్తిని, ఉత్సాహాన్ని పెంచుకోండి. వ్యాపార భాగస్వామ్యాలకు సహకరించండి. అనుకూలమైన ఆర్థిక ఫలితాలను ఆశించండి. కుటుంబంలో ఓపెన్‌ డిస్కషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. జీవితంలోని అన్ని అంశాలలో రాజీ, న్యాయాన్ని వెతకండి. అదృష్ట సంఖ్య: 2. అదృష్ట రంగు: పింక్. అదృష్ట రత్నం: పగడం. వృశ్చికం (Scorpio):భావోద్వేగ గాయాలను నయం చేయడం, క్షమాపణను కనుగొనడం అవసరం. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన రిలేషన్‌లో విషయాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. మీ సన్నిహిత స్నేహితులకు మద్దతు ఇవ్వండి. కెరీర్‌లో వ్యూహాత్మక ప్రణాళిక, గోప్యతను సమర్థించే సమయం. ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది, అదనపు బాధ్యతలు అందుకుంటారు. కొత్త, వినూత్న వ్యాపార అవకాశాలు పొందుతారు. ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక కదలికలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించండి. సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మీ అంతర దృష్టి, శక్తిని ఉపయోగించండి. మీరు సెల్ఫ్‌ కేర్‌, ఎమోషనల్ హీలింగ్‌కి సమయాన్ని వెచ్చించాలి. అదృష్ట సంఖ్య: 6. అదృష్ట రంగు: నలుపు. అదృష్ట రత్నం: మణి ధనస్సు (Sagittarius):గత ఆగ్రహావేశాలను వీడాలి, ఇంట్లో కొత్త ప్రారంభాలను స్వీకరించాలి. కొత్త రొమాంటిక్‌ ఆపర్చునిటీలు పొందుతారు. బంధువుల నుంచి సపోర్ట్‌, సలహాలు అందుకోండి. కెరీర్‌లో మీ క్రియేటివిటీ, ప్యాషన్‌ చూపించే అవకాశం లభిస్తుంది. వర్క్‌లో సవాళ్లు ఎదురైనప్పుడు పట్టుదలతో ఉండాలి. తప్పనిసరిగా ప్రస్తుత వ్యాపార ఆలోచనలను పునఃపరిశీలించాలి. కొత్త అవకాశాలను అన్వేషించడం కొనసాగించాలి. నెమ్మదిగా కానీ స్థిరమైన ఆర్థిక పురోగతిని ఆశించండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబంలో సానుకూల మార్పులు, అవకాశాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య: 11. అదృష్ట రంగు: ఊదా. అదృష్ట రత్నం: ముత్యం మకరం (Capricorn):అంకితభావంతో మీ ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ప్రియమైనవారితో విజయాలను జరుపుకోండి. కెరీర్ సవాళ్లకు వినూత్న పరిష్కారాలను వెతకండి. బిజినెస్‌ వెంచర్లలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం అందుకుంటారు. పనిలో కొత్త అవకాశాలను స్వీకరించండి. స్థిరమైన అవకాశాలలో పెట్టుబడి పెట్టండి. ఓర్పు, వ్యూహంతో ఆఫీసు కార్యాలయ రాజకీయాలను మేనేజ్‌ చేయండి. మొత్తం శ్రేయస్సు, కుటుంబ ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 1. అదృష్ట రంగు: బ్రౌన్. అదృష్ట రత్నం: వజ్రం. కుంభం (Aquarius):ఇంటి విషయాల్లో ఎమోషనల్ ఎక్స్‌పెక్టేషన్‌లు మేనేజ్‌ చేయండి, ముందుకు సాగండి. గత బాధలను వదిలేసి, కొత్త ప్రేమ అవకాశాలను స్వీకరించండి. బంధువులతో వ్యవహరించేటప్పుడు స్పష్టత ముఖ్యం. ఈ రోజు మీ కెరీర్‌కు ఇంటెలిజెన్స్‌, లాజిక్‌ థింకింగ్‌ తెస్తుంది. మీరు బ్యాలెన్స్‌ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. వర్క్‌లో న్యాయమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంత కాలం ఆర్థిక పరిస్థితులు స్తబ్ధుగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అదృష్ట సంఖ్య: 13. అదృష్ట రంగు: ఆక్వా. అదృష్ట రత్నం: నీలి నీలమణి. మీనం (Pisces):సామరస్యపూర్వక సంబంధాలతో ఇంట్లో ఉత్సాహం, సాహసం అనుభవించండి. సహాయక బంధువుల నుంచి గైడెన్స్‌ పొందండి. ఆఫీసులోకి సృజనాత్మక శక్తిని, తేజస్సును తీసుకురండి. విజయం కోసం కొలాబరేషన్‌, టీమ్‌వర్క్‌కి టుకృషిని నొక్కి చెప్పండి. కొత్త ఆలోచనలతో ఆర్థిక లాభాలు అంచనా వేయండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆఫీస్ వ్యవహారాలను డిప్లమేటిక్‌గా మేనేజ్‌ చేయండి. భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబాన్ని రక్షించడానికి సరిహద్దులను ఏర్పాటు చేయండి. అదృష్ట సంఖ్య: 12. అదృష్ట రంగు: సీ గ్రీన్. అదృష్ట రత్నం: ఒపాల్. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


AP Power Cuts: మోదీ పర్యటన ఏర్పాట్లు, బెజవాడలో కరెంటు కోతలు….అల్లాడిపోయిన జనం, ముందస్తు సమాచారం ఇవ్వక ఇబ్బందులు

AP Power Cuts: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రోడ్‌ షో కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు విజయవాడలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


1,200 మందికి జీహెచ్​ఎంసీ లీగల్ నోటీసులు

1,200 మందికి జీహెచ్​ఎంసీ లీగల్ నోటీసులు చెక్కులు బౌన్స్ అయిన పన్నుదారులపై అధికారులు సీరియస్  వారిపై కంప్లయింట్ చేయడంతో పోలీసులు కేసులు ఫైల్   బౌన్స్ అయిన చెక్కుల విలువ రూ. 20 కోట్లు హైదరాబాద్, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ కింద జీహెచ్ఎంసీకి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో అధికారులు సీరియ స్ గా ఉన్నారు. చెక్కుల రూపేణ ఇచ్చిన వారిపై  పోలీసులకు కంప్లయింట...


మే 7 నుంచి ఎప్ సెట్ .. అటెండ్ కానున్న 3.54 లక్షల మంది విద్యార్థులు

మే 7 నుంచి ఎప్ సెట్ .. అటెండ్ కానున్న 3.54 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు నిమిషం నిబంధన అమలు బయోమెట్రిక్, ఫేషియల్ అటెండెన్స్ అమలు హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎప్ సెట్ –2024  మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. నిర్ణీత సమయానికి నిమిషం ...


Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Siddipet : రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో వడదెబ్బ తగిలి ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఎలక్షన్ సంబంధిత శిక్షణ వెళ్లి అస్వస్థతకు గురైన టీచర్...చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు.


ఆంజనేయుని చేతిలో ఆత్మలింగం ఉన్న ఆలయం ఇదే.. భక్తులపాలిట కల్పతరువు!

అడవులకు నెలవై, సుందరమైన ప్రకృతి రమణీయతలకు నిలయమై తెలంగాణా కాశ్మీరంగా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో పురాతనమైన దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు కూడా ఉన్నాయి. అయితే జిల్లాలోని ప్రసిద్ద ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్న ఒక్కో క్షేత్రం ఒక్కో చరిత్రను కలిగి ఉంది. అందులో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండలవాడ గ్రామంలోని శ్రీ ఆత్మలింగ హనుమాన్ దేవాలయం ఒకటి. దాదాపు నాలుగు వందల యేళ్ల ప్రాచీన చరిత్రను కలిగి...


ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం.. కూటమి, వైసీపీ అభ్యర్థుల ఆత్మీయ పలకరింపులు

Srinivasa Varma Guduri Uma Bala Shake Hand: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.


కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్​గాంధీ

కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్​గాంధీ కొంత మంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నరు: రాహుల్ కాంగ్రెస్​ పవర్​లోకి వస్తే దేశమంతా కుల గణన.. రిజర్వేషన్ల పెంపు రైతులందరికీ రుణమాఫీ.. పేదింటి మహిళకు ఏటా రూ. లక్ష నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, రూ. లక్ష సాయం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ ప్లాన్​ ధనికులకు రూ. 16 లక్ష...


కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి  అధికారంలోకి వచ్చింది: కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి  అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మోచేతికి బెల్లంపెట్టి మోసపూరిత హామీలతో గెలిచిందన్నారు.  ఆరు గ్యారంటీల్లో  ఒక్కటి అమలు చేసి  మగవాళ్లకు,  మహిళలకు తాకులాట పెట్టారన...


ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​

ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​ ఎండల ఎఫెక్ట్ చెరువుల్లోని చేపలపై కూడా పడింది. చెరువుల్లో నీరు వేడెక్కడంతో చేపలకు ఆక్సిజన్‌‌ అందక చనిపోతున్నాయి. మరోవైపు సూర్యుడి ప్రతాపానికి చెరువుల్లో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, తంగళ్లపల్లి మండలం మండేపల్లి చెరువుల్లో చేపలు చనిపోయాయి. టెంపర...


NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష

NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.


జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన జలపాతాలు!

: ఇండియాలా ఎన్నో జలపాతాలు ఉన్నాయి. అందులో పాపులర్ అయిన వాటర్ ఫాల్స్ ఏంటో తెలుసుకుందాం.


ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్​ రావు

ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్​ రావు నిధుల విడుదలకు ఈసీ పర్మిషన్ ఇచ్చింది హైదరాబాద్, వెలుగు: మార్చిలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారం ఒకట్రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదివారం ఓ ప్రకటనలో ఆదేశ...


కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత

కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత ఢిల్లీ  లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవితకు మరోసారి నిరాశ ఎదురయ్యింది. కవిత రెండు బెయిల్ పిటిషన్లను  ట్రయల్ కోర్టు కొట్టేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను న్యాయమూర్తి కావేరి బవేజా డిస్మిస్ చేశారు. లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తనను అక్రమంగా అరెస...