ప్రతీ మహిళకూ రూ.3 లక్షలు. ఈ వ్యాపారానికి ఇస్తున్న కేంద్రం.. ఇలా పొందండి
కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల వ్యాపారాలు చేసే వారికి రూ.3 లక్షల చొప్పున మనీ ఇస్తోంది. ఆ పథకం పేరు ఉద్యోగిని పథకం. ఇందులో ఉన్న కండీషన్ ఏంటంటే.. ఈ వ్యాపారం చేసేవారు మహిళలై ఉండాలి. మగవారికి ఈ మనీ ఇవ్వదు. మహిళలకు మాత్రమే ఇస్తుంది. ఆ వ్యాపారం ఇదే:మీరు టీ స్టాల్ పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల రూపాయలు రుణం రూపంలో పొందవచ్చు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు రుణంలో 50 శాతాన్ని కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది. అంటే వారు రూ.3లక్షలు రుణం తీసుకుంటే.. వారు చెల్లించాల్సింది రూ.1.5 లక్షలు మాత్రమే. దానిపై వడ్డీ ఉండదు. ఒకవేళ రుణం తీసుకునే మహిళ ప్రత్యేక కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ అయితే.. వారికి మాగ్జిమం ఇచ్చే రూ.3లక్షల రుణంపై.. రూ.90వేల దాకా కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అందువల్ల వారు రూ.2.1 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగిని పథకం షరతులు: ఈ డబ్బును కేంద్రం.. సిటీల్లో మహిళల కంటే.. గ్రామాల్లో మహిళలకు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అందువల్ల గ్రామాల్లో ఉండే మహిళలు ఎక్కువగా ఈ మనీ పొందగలరు. ఈ మనీ పొందడం ద్వారా.. లబ్దిదారైన మహిళ ఆదాయం, కుటుంబ ఆదాయం పెరిగి.. దేశానికి మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. కేంద్రం ఇచ్చే డబ్బును వ్యాపారానికి వాడుకొని, తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ మహిళా రైతులు ఈ పథకం ద్వారా బ్యాంకుల్లో వడ్డీ లేని రుణం పొందవచ్చు. ఈ ఉద్యోగిని పథకాన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలుచేస్తున్నాయి. ఉద్యోగిని పథకం ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణం మాత్రమే కాదు.. ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా పొందుతారు. ఈ పథకం కింద కేంద్రం రూ.3 లక్షల దాకా వడ్డీ లేని రుణం ఇస్తుంది. ఈ రుణం పొందేందుకు ఎలాంటి హామీ పత్రాలూ అవసరం లేదు. ఈ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ఎలాంటి ఫీజూ తీసుకోవు. అర్హతలు:ఈ పథకం కింద లోన్ పొందాలంటే.. కుటుంబ సంవత్సర ఆదాయం రూ.2 లక్షలు లేదా అంత కంటే తక్కువ ఉండాలి. భర్త లేని మహిళలు, దివ్యాంగులైన మహిళల కుటుంబ ఆదాయానికి ఎలాంటి పరిమితులూ లేవు. ఈ లోన్ ఇచ్చేటప్పుడు ఎస్సీ/ఎస్టీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మహిళ వయస్సు 18 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. లోన్ పొందాలనుకున్న మహిళలు, ఇదివరకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తగిన గడువులో చెల్లించి ఉండాలి. రుణం పొందేందుకు కావాల్సిన పత్రాలు:ఉద్యోగిని స్కీమ్ కింద లోన్ పొందడానికి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటో, జన్మ ధృవీకరణ పత్రం, అడ్రెస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ కాపీతోపాటూ బ్యాంక్ కోరే ఇతర పత్రాలు అవసరం. ఎలా దరఖాస్తు చేసుకోవాలి:ఉద్యోగిని పథకాన్ని పొందాలనుకునే మహిళలు.. తమకు దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి.. మనీ కోరాలి. వారు కావాల్సిన పత్రాలను కోరతారు. వాటిని సమర్పించాలి. అలాగే ఓ ఫారం ఇస్తారు. దాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. ఆ తర్వాత అన్నీ పరిశీలించి లోన్ ఇస్తారు. లేదంటే.. బ్యాంకుల అధికారిక వెబ్సైట్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఐతే.. ఆన్లైన్లో కంటే, డైరెక్టుగా వెళ్లి అడగడం ద్వారా మరింత త్వరగా పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
2024-05-05T16:55:44Z