Trending:


స్కూల్‌కి లేటుగా వచ్చిన టీచర్.. చితకబాదిన ప్రిన్సిపల్.. వీడియోపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

ఉత్తరప్రదేశ్‌.. ఆగ్రాలోని సీగానా గ్రామంలో.. ఓ ప్రీ సెకండరీ స్కూల్‌లో టీచర్‌ స్కూల్‌కి లేటుగా వచ్చింది. దాంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్.. గుంజన్ చౌదరిపై ఇంతెత్తున లేచారు.. లేటుగా ఎందుకు వచ్చావ్ అంటూ.. చితకబాదారు. అటు టీచర్ కూడా ఎదురు తిరిగింది. ఇద్దరి మధ్యా పెనుగులాట జరిగింది. ఐతే.. టీచర్‌పై చెయ్యి చేసుకోవడమే కాకుండా.. ఆ ప్రిన్సిపల్.. తన బట్టలు చించేందుకు టీచర్ యత్నించిందని ఆరోపించారు.వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే.. ప్రిన్సిపల్ కారు డ్రైవర్ వచ్చి.....


Ap Elections Live Updates: నేడు ఏపీకి ప్రధాని మోదీ.. రెండు కీలక సభలు

AP Assembly Election 2024 News Live Updates: ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి చివరి అంకానికి చేరుకుంది. ఈ శనివారంతో ప్రచారం ముగుస్తోంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచారు.. ఓవైపు ప్రధాన పార్టీల అధినేత, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ కూటమి తరఫున ప్రచారానికి వస్తున్నారు.. రెండు సభల్లో పాల్గొంటారు. ఏపీ ఎన్నికల తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి.. లైవ్ అప్డేట్స్ ఇలా..


హైదరాబాద్​లో హీట్ ఐలాండ్స్!

హైదరాబాద్​లో హీట్ ఐలాండ్స్! 7 ప్రాంతాల్లో ఉన్నట్టు తేల్చిన ‘హైదరాబాద్​ అర్బన్​ ల్యాబ్’​ రీసెర్చర్లు పటాన్​చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్​దేవ్​పల్లి,  బీఎన్​రెడ్డి నగర్, మన్సూరాబాద్,  హయత్​నగర్​లో అసాధారణ ఉష్ణోగ్రతలు ల్యాండ్​ సర్ఫేస్​ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా పెరిగిపోతున్న కాంక్రీట్​ నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్ట్  చెట్లు కొట్టేయ...


రైతులకు అదిరే శుభవార్త.. అకౌంట్లలోకి మళ్లీ రూ.2 వేలు, వచ్చేది ఆరోజే?

అన్నదాతలకు అదిరే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా? ప్రభుత్వం అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లీ డబ్బులు రానున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మోదీ సర్కార్ రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్‌ను తీసుకువచ్చింద. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కీమ్ కింద 9 కోట్ల మందికి పైగా ప్రయోజనం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ డబ్బు ఒకేసారి కాకుండా విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నాయి. రూ. 2 వేల చొప్పున వస్తాయి. అంటూ మూడు విడతల్లో ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారత ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కింద 16 విడతల డబ్బులను జమ చేసింది. అంటే రూ. 32 వేలు ఇప్పటికే అన్నదాతలకు లభించాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ మొత్తం కూడా వస్తే.. రూ. 34 వచ్చినట్లు అవుతుంది. చివరిగా ఫిబ్రవరి 28న మోదీ సర్కార్ రైతుల బ్యాంక్ ఖాతాల్లో 16 విడత కింద డబ్బులు జమ చేసింది. మరి 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పలు నివేదికలు మాత్రం.. పీఎం కిసాన్ స్కీమ్ కింద 17వ విడత డబ్బులు త్వరలోనే బ్యాంక్ ఖాతాల్లో పడొచ్చని పేర్కొంటున్నాయి. జూన్ చివరి వారంలో లేదా జూలై తొలి వారంలో ఈ డబ్బులు రైతులకు లభించొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాగా పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు మే నెల చివరి కల్లా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రావొచ్చని నివేదికలు గతంలో అంచనా వేశాయి. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు జూన్ నెల చివరిలో లేదా జూలై తొలి వారంలో రావొచ్చని నివేదికలకు తెలియ జేస్తున్నాయి. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొంది. లోక సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.ఇప్పటికే రాజకీలయ పార్టీలు జనాలను ఆకట్టుకునేందుకు పలు రకాల తాయిలాలు ప్రకటించాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చూడాలి.


బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా?

బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా? ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు​ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారని, వాళ్లు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. వారిపై అవినీతి, పరువు నష్టం, ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయన్నారు. పరువు నష్టం కేసులో రెండేండ్ల జైలు శిక్ష పడితే...


రాజమహేంద్రవరంవాసులకు అలర్ట్.. ఈ రూట్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

Rajahmundry Traffic Restrictions: ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. మరో వారం మాత్రమే సమయం ఉండటంతో ఏపీలో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు కూటమి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 6న ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. వేమగిరి జంక్షన్‌లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన కావడంతో భారీ బందోస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు...


దొంగలు బీభత్సం.. బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ

దొంగలు బీభత్సం.. బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ TSRTCలో దొంగలు బీభత్సం సృష్టించారు.  లహరి బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేశారు.  షిరిడి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికులు..  మియాపూర్ లో బస్సు దిగి చూసేసరికి బ్యాగులు మాయమయ్యాయి.  బ్యాగుల్లో సెల్ ఫోన్లు, నగదు ఉన్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమ...


వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం

వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ మద్దతుగా కాంగ్రెస్​ శ్రేణులు, అభిమానులు, వివిధ ప్రజాసంఘాలు శనివారం విస్తృత ప్రచారం చేశారు. పెద్దపల్లిలో యూత్​కాంగ్రెస్​ నాయకుడు కొండి సతీశ్, మహనీయుల ఆశయ సాధన సమితి అధ్యక్షుడు బొంకూరి కైలాసం, మంథని ...


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రైతులకు అసలైన భరోసా.. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయా ?

ఆంధ్రప్రదేశ్ లో అమలైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భయాలు సృష్టించి తద్వారా కూటమి లాభపడాలని ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి అనుకూల మీడియాలోనే కొన్ని కథనాలు వచ్చాయి. ఆ కథనాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు చాలా మంచింది అని తెలిపారు. కానీ ఇప్పుడు అదే మీడియాలో వ్యతిరేక...


రైతులకు శుభవార్త.. అందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లలో డబ్బులు పడేది అప్పుడే..!

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. అకాల వర్షాలు పండించిన పంటలను నాశనం చేయగా.. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. తీవ్ర ఆవేదనలో ఉన్న ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంది. ఈ మేరకు నష్ట పరిహం నిధుల విడుదలకు అనుమతివ్వాలని ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేయగా.. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. రైతు ఖాతాల్లోకి పరిహారం డబ్బులు జయ చేయనుంది ప్రభుత్వం.


హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. నగరానికి హైస్పీడ్ రైల్ కారిడార్, వందే భారత్ మెట్రో

హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్. నగరంలో హైస్పీడ్ రైల్ కారిడార్, వందే భారత్ మెట్రో పరుగులు పెట్టనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఈ ప్రాజెక్టులు ప్రతిపాదిత దశలో ఉన్నాయని.. కచ్చితంగా వాటిని పట్టాలెక్కిస్తామని వెల్లడించారు. తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.


ఏటీఆర్ లోకి శంషాబాద్ చిరుత

ఏటీఆర్ లోకి శంషాబాద్  చిరుత అమ్రాబాద్, వెలుగు: శంషాబాద్  ఎయిర్ పోర్ట్ లో హల్ చల్  చేసిన చిరుతను శనివారం అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో ఫారెస్ట్  ఆఫీసర్లు విడిచిపెట్టినట్లు మన్ననూర్  ఎఫ్ఆర్వో ఈశ్వర్  తెలిపారు. ఎయిర్ పోర్ట్  వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మేకను ఎరవేసి బంధించారు. అనంతరం నెహ్రూ జూపార్క్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, అర్ధరాత్రి అమ...


మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు

మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు వికారాబాద్, వెలుగు : గ్రామీణ మహిళలు, యువతులకు ఫ్రీగా బ్యుటీషియన్ ​కోర్సు అందిస్తున్నామని వికారాబాద్​జిల్లా ఎస్​బీఐ లీడ్ మేనేజర్ రాంబాబు తెలిపారు. చిలుకూరు ఎస్​బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి శిక్షణ మొదలవుతుందని, 5 నుంచి 8వ తేదీలోపు సంస్థ డెరెక్టర్​రమేశ్( 8500...


అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది

అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది టెర్రర్​ దాడులకు మేం దీటుగా బదులిస్తున్నం: మోదీ మత రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు  జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పీఎం పలాము(జార్ఖండ్)/ దర్భంగా(బిహార్): దేశ భద్రతపై గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు పిరికితనంతో వ్యవహరించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిం...


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


పైన చింతపండు.. లోపల గంజాయి.. హనుమకొండ బస్టాండ్‌‌‌‌లో నలుగురు అరెస్ట్‌‌‌‌

పైన చింతపండు.. లోపల గంజాయి.. హనుమకొండ బస్టాండ్‌‌‌‌లో నలుగురు అరెస్ట్‌‌‌‌ వరంగల్‍, వెలుగు: చింతపండు బస్తాల్లో గంజాయి పెట్టి రవాణా చేస్తున్న నలుగురిని హనుమకొండ పోలీసులు శనివారం అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ దేవేందర్‌‌‌‌రెడ్డి వెల్లడించారు. ఏపీలోని ఎన్‌‌‌‌టీఆర్‌‌‌‌ జిల్లా వీర్లపాడు పొన్నవరానికి చెందిన ఈదర కృష్ణ, అనుముల వెంకటరమణ ...


అయోధ్యలో మోదీ రోడ్ షో

అయోధ్యలో మోదీ రోడ్ షో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అయోధ్యలో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. అయోధ్యలోని సుగ్రీవ కోట నుంచి లతా చౌక్ వరకు మోదీ 2 కిలోమీటర్ల మేరా రోడ్‌షో చేశారు. అంతకు ముందు ఆయన అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో కలిసి రామ్ బాల రామునికి పూజలు చేశారు. జనవరి 22న అయోధ్య ప్రాణ ప్రత...


మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి

మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి.  దీంతో మత్స్యకారులు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయమని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చేపలను రక్షిచుకునేందుకు బోరు మోటారు సహాయంతో  చెరువులోకి నీటి వదుల...


హైదరాబాద్​ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్

హైదరాబాద్​ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్ న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) గా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్  ఆరోపించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్  చీఫ్​ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదన్నారు. 2022 అక్టోబర్ లో తాను బీఆర్ఎస్ లో చేరినా.. గడపలోకి అడుగుపెట్ట...


మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..

మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు.. లోక్ సభ మూడవ విడత పోలింగ్‌ మే 7న జరగనుంది.  ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం విషయానికి వస్తే మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాను తీసుకుంటే ఇక్కడ పలు తాలూకాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇక్కడ  మే 7న ఇక్కడ మూడవ విడత పోలింగ్‌ జరుగను...


ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్!

Ap Ec Accepting Form 12 On The Spot: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్ల ఓటింగ్‌లో గందరగోళంపై ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. మే 1 నాటికి ఫారమ్ 12 సమర్పించలేక పోస్టల్‌ బ్యాలెట్‌ అందని ఎన్నికల సిబ్బందికి వెసులుబాటు కల్పించింది. వీరు ఈ నెల 7, 8 తేదీల్లో తమ ఓటును వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది.


చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బస్సు యాత్రతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్య మధ్యలో ఆగుతూ చాయ్ తాగుతూ బజ్జీలు తింటూ అక్కడి స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొండగట్టు వద్ద రోడ్డు పక్కన ఓ హోటల్ దగ్గరు కేసీఆర్ ఆగి.. చాయ్ తాగుతూ సమోసా తిన్నారు. ఈ సమయంలో అక్కనున్న చిన్నారులను దగ్గరికి తీసుకుని కేసీఆర్ ముచ్చటించారు. తమ అభిమాన నేతను చూసిన యువతులు కేసీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన గులాబీ బాస్.. తిరిగి జగిత్యాల దిశగా పయనమయ్యారు.


శంషాబాద్​లో 34.78 కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్​లో 34.78 కిలోల బంగారం పట్టివేత శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్​పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 34.78 కిలోల బంగారు నగలు, 43.60  కిలోల వెండిని ఎన్నికల అధికారులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్  పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఎన్నికల తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ ఎస్ఓటీ, శంషాబాద్ పోలీసులు కలిసి వా...


కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు వికారాబాద్, వెలుగు : వికారాబాద్ లో కాంగ్రెస్​మరింత బలపడుతోంది. వికారాబాద్​మున్సిపాలిటీలోని ఐదుగురు బీఆర్ఎస్​కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్​పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్​తీర్థం పుచ్చుకున్నవారిలో కౌన్సిలర్లు హీరేకార్ సురేశ్, నవీన్, లంకా పుష్...


వరంగల్​లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి

వరంగల్​లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి పాలకుర్తి ( కొడకండ్ల ), వెలుగు : వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థి కడియం కావ్య గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం లోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడియం కావ్య గెలు...


NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష

NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.


ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 74 కాలేజీల్లో 33, 630 సీట్లు డిచ్ పల్లి, వెలుగు : తెలంగాణలో 2024–25 దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాగా..  నేటి నుంచి  తెలంగాణ విశ్వవిద్యాలయంలో తొలి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెయూ అధికారిక లెక్కల ప్రకారం.. యూనివర్సిటీ పరిధిలో 74 డిగ్రీ కాలేజీలు ఉండగా.. 33,630 సీట్లు...


Ap politics: ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్

ఏపీ లో సమ్మర్ హీట్ ను మించి పొలిటికల్ హీట్ ఉందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీల నాయకులు ప్రతి అంశాన్ని పరిగణలోకి విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగిస్తున్నారు. అందులో ఇటీవల ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి వైసీపీ , టిడిపి మధ్య విమర్శల జోరు సాగుతోంది. అయితే ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను దేశంలోని పలు రాష్ట్రాలలో అమలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ చట్టంను ఆంధ్రప్రదేశ్ లో సైతం అమలుచేయనున్నారని టిడిపి విమర్శలు గుప్పిస్తోంది.అలాగే ఈ చట్టం అమలుతో భూ యజమానులకు...


1,200 మందికి జీహెచ్​ఎంసీ లీగల్ నోటీసులు

1,200 మందికి జీహెచ్​ఎంసీ లీగల్ నోటీసులు చెక్కులు బౌన్స్ అయిన పన్నుదారులపై అధికారులు సీరియస్  వారిపై కంప్లయింట్ చేయడంతో పోలీసులు కేసులు ఫైల్   బౌన్స్ అయిన చెక్కుల విలువ రూ. 20 కోట్లు హైదరాబాద్, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ కింద జీహెచ్ఎంసీకి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో అధికారులు సీరియ స్ గా ఉన్నారు. చెక్కుల రూపేణ ఇచ్చిన వారిపై  పోలీసులకు కంప్లయింట...


క్వీన్స్‌లాండ్ మహిళా ఎంపీ: ‘నాకు డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా దాడి చేశారు’

"నా శరీరంలో డ్రగ్స్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలాయి, వాటిని నేను తీసుకోలేదు. ఆ పదార్థం నాపై ప్రభావం చూపించింది" అని ఎంపీ బ్రిటానీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.


ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా

ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాట్లాడిన అమిత్ షా..  ముస్లీంలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తన  వీడియో మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికా కాంగ్రెస్ కుట్ర చేస...


మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి

మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి బీజేపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తుక్కుగూడ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన రేవంత్.. కాంగ్రెస్ పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీలతో మోదీ, అమిత్ షాలకు నిద్రపట్టట్లేదన్నారు. అందుకే అయోధ్య, శ్రీరాముడు దేవుళ్ల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. అయోధ్యలో ప్రాణప్ర...


Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

Warangal City News : వరంగల్ శివారులో అత్యంత అమానుషమైన ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన బిడ్డను బతికుండగానే మట్టిలో పాతిపెట్టారు. కాసేపటికే ఓ లారీ డ్రైవర్ గమనించటంతో ఆ నవజాత శిశువు ప్రాణాలతో బయటపడింది.


ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు

ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు భీమదేవరపల్లి, వెలుగు: ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని అబూజ్‌‌‌‌మడ్‌‌‌‌ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన కాసరవేణి రవి అలియాస్‌‌‌‌ వినయ్‌‌‌‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. బెల్లంపల్లికి చెందిన రవి 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్‌‌‌‌ కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడ...


Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

Maoist Kasaraveni Ravi killed in Encounter : తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేత కాశవేయిన రవి(55) ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. చత్తీస్ గడ్(Chhattisgarh) అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోగా… ఆయన స్వగ్రామం వంగరలో శనివారం అంత్యక్రియలు జరిగాయి.


మహిళా భక్తురాలికి ప్రత్యక్షమైన శివయ్య.. కొంగు బంగారం చేసే ఆ గుడి ఇప్పుడు చాలా పాపులర్!

శ్రీకాకుళం పట్టణానికి 18 కిలో మీటర్ల దూరంలో ఆమదాలవలస గాజులకొల్లివలస గ్రామంలో కొండపైన సంగమేస్వరస్వామి ఆలయం ఉంది. సాధారణంగా సంగమం అంటే నదులు కలిసే ప్రదేశం సంగంమం కానీ ఇక్కడ కొండపైన బౌద్ధం, జైన్ , శైవం ఈ మూడు మతాలు సంగమం వలన ఈ కొండను సంగమేస్వరస్వామి అంటారు. పురాణ ప్రసిద్ధ ప్రకారం పూర్వం జైన దిగంబర సాధువు ఒకరు ఉండేవారు ఆయన దూరంగా ఉండే గ్రామాలకు వెళ్లి ఆహారం తెచ్చుకొని ఈ కొండపై జీవిస్తూ ఉండేవారు.ఈ కొండ అంతా అరణ్యం కాబట్టి ఎక్కువుగా చుట్టుపక్కల...


రాహుల్ గాంధీ సభ సక్సెస్​తో కాంగ్రెస్ లో జోష్

రాహుల్ గాంధీ సభ సక్సెస్​తో కాంగ్రెస్ లో జోష్ మండుటెండను లెక్కచేయకుండా తరలివచ్చిన జనం ఫలించిన మంత్రి సీతక్క జన సమీకరణ వ్యూహం కాంగ్రెస్ ప్రచారానికి అనుకూల ప్రభావం నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రాహుల్ గాంధీ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నిండింది. వారం రోజులుగా పార్టీ శ్రేణులు రాహుల్ సభ...


నిలబడి "మూత్ర విసర్జన" చేయడం ఆరోగ్యానికి మంచిదేనా.. పురుషులకు సరైన పొజిషన్ ఏదంటే..?

మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు మరియు అదనపు నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. శరీర పనితీరును నిర్వహించడానికి మూత్రవిసర్జన చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మూత్ర విసర్జన ఎంత అవసరమో.. మూత్ర విసర్జన సమయంలో మీ భంగిమ కూడా అంతే ముఖ్యం. సరైన భంగిమతో మూత్రవిసర్జన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అదే సమయంలో తప్పు భంగిమలో చేస్తే సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది మంగవారు నిలబడి మూత్ర విసర్జన చేస్తుంటే.. కొంత మంది మాత్రం కూర్చొని మూత్రాన్ని విసర్జిస్తుంటారు. అయితే నిలబడి మూత్ర విసర్జన చేయడం పురుషుల ఆరోగ్యానికి హానికరమని.. కూర్చొని మూత్ర విసర్జన చేయడం ప్రయోజనకరమని తరచుగా చెపుతుంటారు.. ఇందులో నిజం ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమబెంగాల్ కుందిన యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అమరేంద్ర పాఠక్.. అభిప్రాయం ప్రకారం. పురుషులు నిలబడి లేదా కూర్చొని ఏ విధంగానైనా మూత్ర విసర్జన చేసినా అది ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావాలను చూపదన్నారు. మూత్ర విసర్జన చేయడానికి సరైన పొజిషన్ అంటూ ఏదీ లేదని తెలిపారు. ప్రజలు తమ సౌకర్యం ప్రకారం మూత్ర విసర్జన చేయవచ్చన్నారు.డాక్టర్ చెప్పిన దాని ప్రకారం.. నిలుచుకుని మూత్ర విసర్జన చేయడం వల్ల పురుషుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని కొందరు చెపుతుంటారని.. అయితే దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని.. ఇవన్నీ పుకార్లేనని చెపుతున్నారు. అయితే ఎవరైనా మూత్ర విసర్జనకు ఇబ్బందిగా ఉంటే వైద్యులను సంప్రదించాలని.. సమస్యను గుర్తించాలన్నారు. మూత్ర విసర్జనకు కూర్చోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరగదని యూరాలజిస్టులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి కూర్చొని మూత్ర విసర్జన చేసినప్పుడు, వారి కాళ్లు మూత్రాశయంపై కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తాయి, ఇది మూత్రవిసర్జనను సులభతరం చేస్తుంది, కానీ ఇది వైద్యపరంగా కూడా నిరూపించబడలేదు. కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెప్పడం సరికాదు. ప్రోస్టేట్ సమస్యలతో బాధపడేవారు కూడా వారి సౌలభ్యం మేరకు మూత్ర విసర్జన చేయవచ్చుని తెలిపారు. వైద్యులు ఈ విషయంలో ప్రోస్టేట్ రోగులకు లేదా ఏ రోగికి ప్రత్యేక సలహాలు ఇస్తారని తెలిపారు. ఇది మానవ అలవాట్లపై కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుందన్నారు. ఇది పురుషులకే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. (గమనిక: ఈ నివేదిక సాధారణ సమాచారం కోసం మాత్రమే, కాబట్టి వివరాల కోసం ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి.)


అరకు: నోటా ఓట్లలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిన నియోజకవర్గం, ఇక్కడి ప్రజలు నోటాను ఎందుకు ఎంచుకుంటున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్ సభ స్థానాల్లో అరకు ఒకటి. దాదాపు 15.39 లక్షల మంది ఓటర్లున్న ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.


రైతులకు అలర్ట్.. భారీ ఆదాయం రావాలంటే పంట వేయడానికి ముందు ఇలా చేయండి!

భూమి సారాన్ని పరీక్షించి తెలుసుకొనే పద్ధతిని భూసార పరీక్ష అంటారు . నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. పంటలకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత పరిమాణంలో నేలలో సహజంగా ఉంటాయి. అయితే వీటిలో వ్యత్యా సాలు ఉండే అవకాశం ఉంది. కావునా నేలలో పోషకాలు ఎంత లభ్యమవుతున్నాయో, వేయదలచిన పైరుకు ఎంతఎరువు అవసరమో నిర్దారించి వాడాలి. కావునా భూసారాన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ సంచాలకులు సత్యవతి అన్నారు. భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పారు. రైతు నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుందని సత్యవతి లోకల్ 18తో వివరించారు. వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనపుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గినాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చును బాగా తగ్గించుకోవచ్చన్నారు. దీని ద్వారా పంటపై పెట్టే పెట్టుబడి తగ్గటమే కాక మంచి దిగుబడుల వలన మంచి ఆదాయం పొందవచ్చునన్నారు. పంట పండించడానికి నేలకు సరిపడ పోషకాలను అందించటం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టడమేకాక భవిష్యత్ తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతామని చెప్పారు. నేలలోని కొంత మట్టిని సేకరించి రసాయన పద్ధతుల ద్వారా లేదా ఇతర విశ్లేషణ పద్ధతుల ద్వారా పరీక్షించటం వలన నేలలో మొక్కకు కావాలసిన పోషక పదర్థాలు ఏయే పాళ్ళలో ఉన్నాయో తెలుసుకోవచ్చనని చెప్పారు.


Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

Ganja Smuggling : సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు చింతపండు మాటున గంజాయి సప్లై చేస్తున్నారు. హనుమకొండలో గంజాయిని మరో ఇద్దరు వ్యక్తులకు ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.


జగన్ గుర్తుంచుకో.. బీజేపీ ఉన్నంతవరకు తెలుగు భాషను అంతం కానివ్వం

ధర్మవరం బహిరంగ సభలో సీఎం జగన్ పై అమిత్ షా నిప్పులు చెరిగారు


ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్​ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్​ శాతం

ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్​ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్​ శాతం పల్లెల్లో బెటర్.. పట్టణ ఓటర్లను కదిలిస్తేనే పోలింగ్​  పర్సెంటేజీలో పెరుగుదల నిజామాబాద్​, వెలుగు: ఇందూర్​ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఏటా ఓటర్లు పెరుగుతున్నా ఓటింగ్​ శాతం మెరుగు పడటం లేదు.   పైగా ప్రతిసారి అర్బన్​లో మరీ తక్కువ ఓటింగ్​ నమోదు కావడం ఆఫీసర్లను కలవరపె...


పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!

పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..! రోడ్లు, డ్రైన్లలో నవజాత శిశువుల మృతదేహాలు కండ్లు తెరవక ముందే కాటికెళ్తున్న పసిప్రాణాలు విచారణను గాలికొదిలేస్తున్న ఆఫీసర్లు కనీస చర్యలు లేక తరచూ ఇవే ఘటనలు హనుమకొండ, వెలుగు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డలు కండ్లు తెరవక ముందే కాటికి చేరుతున్నారు. ఆడ శిశువులనో.. లేదా ఆర్థిక భారమనుకునో.. మరే ఇతర కారణాలోగానీ పుట్ట...


ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆయనకే ఛాన్స్?.. ప్యానల్‌లో ఆ ముగ్గురు పేర్లు!

Andhra Pradesh New Dgp Appointment: డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలని ఆయన్ను ఆదేశించింది. తన తర్వాతి ర్యాంక్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం పదకొండు గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ...


రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు

రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు పునర్విచారణకు ఆదేశిస్తం.. న్యాయం జరిగేలా చూస్తం రోహిత్​ తల్లికి సీఎం రేవంత్​రెడ్డి హామీ హైదరాబాద్​, వెలుగు: రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో 2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకోగా.. ...


అల్‌‌ జజీరా వార్తా సంస్థపై ఇజ్రాయెల్ నిషేధం

అల్ జజీరా గాజా బ్యూరో చీఫ్ వేల్ అల్ దహ్‌దౌ కుమారుడు హంజా అల్ దహ్‌దోతో పాటు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. జర్నలిస్టులను తాము టార్గెట్ చేయట్లేదంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది.


ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్..!

ముక్కుపచ్చలారని పసిగుడ్డును వదిలించుకోవాలనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణాలతో ఉండానే మట్టిలో పూడ్చేశారు. అయితే దేవుడిలా వచ్చిన ఓ ట్యాంకర్ డ్రైవర్ శిశువుకు పునర్జన్మను ప్రసాదించాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


గుంటూరు: ఆస్పత్రిలో ఇదేం పాడు పని.. జనాలున్నారనే సిగ్గు లేకుండా!

Guntur Govt Hospital Mobiles Robbery: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న వరుస ఘటనలు కలకలంరేపుతున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజ్‌ గమనిస్తే ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ఓ వ్యక్తి అందరూ పడుకుని ఉన్నప్పుడు వచ్చి.. పడుకున్న వ్యక్తి పక్కన కూర్చుని.. సైలెంట్‌గా ఫోన్ లేపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రోగి సహాయకులను అధిక సంఖ్యలో ఆసుపత్రి లోపలకి అనుమతించడం వల్లే సమస్యలు ఎదురువుతున్నాయని కొందరు చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Rasi Phalalu 6-5-2024: వారికి బంధువుల సపోర్ట్‌ లభిస్తుంది

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 6వ తేదీ, సోమవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):బ్యాలెన్స్‌డ్‌ ఎన్విరాన్‌మెంట్‌, సామరస్యపూర్వక సంబంధాలు, రొమాంటిక్‌ మూమెంట్స్‌ పెంపొందించడానికి ఇంట్లో స్ట్రక్చర్‌, డిసిప్లైన్‌ మెయింటైన్‌ చేయండి. వృత్తిపరమైన స్థిరత్వం, పనుల్లో విజయాన్ని కొనసాగిస్తూ బంధువులతో ఆనందకరమైన సమావేశాలను ఆస్వాదించండి. అంకితభావంతో, ఏకాగ్రతతో ఉండండి. వర్క్‌లో మీకు మీరు పెట్టుకున్న పరిమితుల నుంచి విముక్తి పొందండి. కొత్త వ్యాపార అవకాశాలను స్వీకరించండి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. విభేదాలను నివారించడానికి, శారీరక, మానసిక స్థితిస్థాపకతను పెంపొందించడానికి దౌత్యాన్ని కొనసాగించండి. కుటుంబ ఒత్తిడులను ఎదుర్కొంటే పెద్దల నుంచి గైడెన్స్‌ పొందండి. అదృష్ట సంఖ్య: 9. అదృష్ట రంగు: ఎరుపు. అదృష్ట రత్నం: రూబీ. వృషభం (Taurus):ఇంట్లో సామరస్యం, సంతృప్తిని అనుభవించండి. లోతైన భావోద్వేగ బంధాలను పెంపొందించుకోండి. బంధువుల నుంచి సపోర్ట్‌ పొందండి. క్లియ్‌ కమ్యూనికేషన్, ఇన్నోవేటివ్‌ థింకింగ్‌ ద్వారా పనిలో గుర్తింపు పొందుతారు. సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించవచ్చు, ఆర్థిక భద్రత కోసం కృషి చేయండి. స్నేహితుడు మంచి పెట్టుబడుల సలహాలు చేస్తాడు. మంచి ఆరోగ్యం, శక్తిని ఆస్వాదించండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న దాతృత్వాన్ని గౌరవించండి. అదృష్ట సంఖ్య: 4. అదృష్ట రంగు: ఆకుపచ్చ. అదృష్ట రత్నం: తెల్ల నీలమణి. మిథునం (Gemini):రొమాంటిక్‌ అడ్వెంచర్‌లు, కొత్త కనెక్షన్‌లను అన్వేషించేటప్పుడు మీ కుటుంబంలోని ఎమోషనల్‌ ఛాలెంజెస్‌ని పరిష్కరించండి. ముఖ్యంగా బంధువులతో అపార్థాలు రాకుండా సహృద్భావాన్ని కొనసాగించండి. కెరీర్‌లో వృద్ధి కోసం ఇంటలెక్చువల్‌ క్యూరియాసిటీ, శ్రద్ధను ప్రదర్శించండి. పెట్టుబడులకు సంబంధించి నిపుణుల సలహాలు కోరండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆఫీసు రాజకీయాల మధ్య న్యూట్రల్‌గా ఉండండి. హీలింగ్‌, ఫర్గివ్‌నెస్‌ కోసం సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 7. అదృష్ట రంగు: పసుపు. అదృష్ట రత్నం: సిట్రిన్. కర్కాటకం (Cancer):ఈ రోజు స్థిరమైన, కమిటెడ్‌ రిలేషన్‌ పెంపొందించుకోండి. ఆత్మపరిశీలనను స్వీకరించండి, ఇంట్లో సంతృప్తిని కనుగొనండి. బంధువులతో సరిహద్దులను ఏర్పరచుకోండి. మీ కెరీర్‌లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌, క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి. వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో అభివృద్ధి, సంతృప్తి కోసం అవకాశాలను వెతకండి. ఊహించని ఆర్థిక లాభాలు అందుతాయి. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్‌లు, రివార్డ్‌లను బ్యాలెన్స్‌ చేయండి. ముందుకు సాగడానికి మీ శక్తిని బలోపేతం చేయండి, సంఘర్షణలను పరిష్కరించుకోండి. అదృష్ట సంఖ్య: 3. అదృష్ట రంగు: వెండి. అదృష్ట రత్నం: ఒనిక్స్. సింహం (Leo):గృహ విషయాల్లో సహనం, పట్టుదల చూపుతారు. ఈ రోజు ప్రేమ, సంతానోత్పత్తి, రిలేషన్‌లు కూడా ఎదురవుతాయి. మీ స్నేహితుడికి మద్దతు ఇవ్వాల్సిన, రక్షించాల్సిన అవసరం ఉండవచ్చు. ఈ రోజు మీ నాయకత్వాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్‌ వెంచర్ల కోసం వ్యూహాత్మక ప్రణాళికను ఉపయోగించండి. పెట్టుబడులపై ఆర్థిక లాభాలను ఆశించండి. ఔషధాలపై తక్కువ ఆధారపడండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. కోపాన్ని విడిచిపెట్టి, శాంతింపజేయడానికి క్షమాపణ కోరండి. అదృష్ట సంఖ్య: 8. అదృష్ట రంగు: బంగారం. అదృష్ట రత్నం: పచ్చ కన్య (Virgo):ఇంట్లో ప్రాక్టికాలిటీ, స్థిరత్వంపై దృష్టి పెట్టండి. సవాలు చేసే వ్యక్తుల నుంచి ఎమోషనల్ డిటాచ్‌మెంట్ కొనసాగిస్తూ, ఉద్వేగభరితమైన రిలేషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. కెరీర్ అభివృద్ధికి, సహోద్యోగులతో సంబంధాలను పెంపొందించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. వ్యాపారంలో అడ్డంకులను అధిగమించి, ఆర్థిక నిర్ణయాల కోసం నిపుణుల సలహాలను పొందండి. కుటుంబ విలువలను నిలబెట్టేటప్పుడు సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌, సెల్ఫ్‌ అభ్యసించండి. అదృష్ట సంఖ్య: 5. అదృష్ట రంగు: నీలం. అదృష్ట రత్నం: మూన్‌స్టోన్‌. తుల (Libra):ఇంటి విషయాల్లో బ్యాలెన్స్‌ కోసం కృషి చేయండి. కొత్త ప్రేమ, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ స్వీకరించండి. సహోద్యోగులతో సరిహద్దులను నిర్వహించండి. కెరీర్ విజయం కోసం శక్తిని, ఉత్సాహాన్ని పెంచుకోండి. వ్యాపార భాగస్వామ్యాలకు సహకరించండి. అనుకూలమైన ఆర్థిక ఫలితాలను ఆశించండి. కుటుంబంలో ఓపెన్‌ డిస్కషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. జీవితంలోని అన్ని అంశాలలో రాజీ, న్యాయాన్ని వెతకండి. అదృష్ట సంఖ్య: 2. అదృష్ట రంగు: పింక్. అదృష్ట రత్నం: పగడం. వృశ్చికం (Scorpio):భావోద్వేగ గాయాలను నయం చేయడం, క్షమాపణను కనుగొనడం అవసరం. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన రిలేషన్‌లో విషయాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. మీ సన్నిహిత స్నేహితులకు మద్దతు ఇవ్వండి. కెరీర్‌లో వ్యూహాత్మక ప్రణాళిక, గోప్యతను సమర్థించే సమయం. ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది, అదనపు బాధ్యతలు అందుకుంటారు. కొత్త, వినూత్న వ్యాపార అవకాశాలు పొందుతారు. ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక కదలికలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించండి. సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మీ అంతర దృష్టి, శక్తిని ఉపయోగించండి. మీరు సెల్ఫ్‌ కేర్‌, ఎమోషనల్ హీలింగ్‌కి సమయాన్ని వెచ్చించాలి. అదృష్ట సంఖ్య: 6. అదృష్ట రంగు: నలుపు. అదృష్ట రత్నం: మణి ధనస్సు (Sagittarius):గత ఆగ్రహావేశాలను వీడాలి, ఇంట్లో కొత్త ప్రారంభాలను స్వీకరించాలి. కొత్త రొమాంటిక్‌ ఆపర్చునిటీలు పొందుతారు. బంధువుల నుంచి సపోర్ట్‌, సలహాలు అందుకోండి. కెరీర్‌లో మీ క్రియేటివిటీ, ప్యాషన్‌ చూపించే అవకాశం లభిస్తుంది. వర్క్‌లో సవాళ్లు ఎదురైనప్పుడు పట్టుదలతో ఉండాలి. తప్పనిసరిగా ప్రస్తుత వ్యాపార ఆలోచనలను పునఃపరిశీలించాలి. కొత్త అవకాశాలను అన్వేషించడం కొనసాగించాలి. నెమ్మదిగా కానీ స్థిరమైన ఆర్థిక పురోగతిని ఆశించండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబంలో సానుకూల మార్పులు, అవకాశాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య: 11. అదృష్ట రంగు: ఊదా. అదృష్ట రత్నం: ముత్యం మకరం (Capricorn):అంకితభావంతో మీ ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ప్రియమైనవారితో విజయాలను జరుపుకోండి. కెరీర్ సవాళ్లకు వినూత్న పరిష్కారాలను వెతకండి. బిజినెస్‌ వెంచర్లలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం అందుకుంటారు. పనిలో కొత్త అవకాశాలను స్వీకరించండి. స్థిరమైన అవకాశాలలో పెట్టుబడి పెట్టండి. ఓర్పు, వ్యూహంతో ఆఫీసు కార్యాలయ రాజకీయాలను మేనేజ్‌ చేయండి. మొత్తం శ్రేయస్సు, కుటుంబ ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 1. అదృష్ట రంగు: బ్రౌన్. అదృష్ట రత్నం: వజ్రం. కుంభం (Aquarius):ఇంటి విషయాల్లో ఎమోషనల్ ఎక్స్‌పెక్టేషన్‌లు మేనేజ్‌ చేయండి, ముందుకు సాగండి. గత బాధలను వదిలేసి, కొత్త ప్రేమ అవకాశాలను స్వీకరించండి. బంధువులతో వ్యవహరించేటప్పుడు స్పష్టత ముఖ్యం. ఈ రోజు మీ కెరీర్‌కు ఇంటెలిజెన్స్‌, లాజిక్‌ థింకింగ్‌ తెస్తుంది. మీరు బ్యాలెన్స్‌ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. వర్క్‌లో న్యాయమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంత కాలం ఆర్థిక పరిస్థితులు స్తబ్ధుగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అదృష్ట సంఖ్య: 13. అదృష్ట రంగు: ఆక్వా. అదృష్ట రత్నం: నీలి నీలమణి. మీనం (Pisces):సామరస్యపూర్వక సంబంధాలతో ఇంట్లో ఉత్సాహం, సాహసం అనుభవించండి. సహాయక బంధువుల నుంచి గైడెన్స్‌ పొందండి. ఆఫీసులోకి సృజనాత్మక శక్తిని, తేజస్సును తీసుకురండి. విజయం కోసం కొలాబరేషన్‌, టీమ్‌వర్క్‌కి టుకృషిని నొక్కి చెప్పండి. కొత్త ఆలోచనలతో ఆర్థిక లాభాలు అంచనా వేయండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆఫీస్ వ్యవహారాలను డిప్లమేటిక్‌గా మేనేజ్‌ చేయండి. భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబాన్ని రక్షించడానికి సరిహద్దులను ఏర్పాటు చేయండి. అదృష్ట సంఖ్య: 12. అదృష్ట రంగు: సీ గ్రీన్. అదృష్ట రత్నం: ఒపాల్. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.