తత్తూరు స్వీట్స్ తిన్నారా.. స్పెషాలిటీ ఇదే, ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు!
500 సంవత్సరాల చరిత్ర గల తత్తూరు రంగనాథ స్వామి తిరుణాలలో పెద్దపెద్ద స్వీట్ షాప్ లో చాలా చక్కగా ఎంతో రుచికరమైన స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వీట్ అన్ని మన కళ్ళు ఎదురుగానే తయారుచేసి అమ్మకాలు జరుపుతారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరుణాల ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తిరుణాల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తరలివచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తిరునాళ్లను తిలకించేందుకు వెళ్తూ ఉంటారు. తిరుణాలలో భాగంగా పెద్దపెద్ద స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు, తత్తూరు తిరునాళ్లకు ముఖ్యమైనవిగా ఈ స్వీట్ షాపులు అని చెప్పవచ్చును. తిరుణాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ తయారు చేసే స్వీట్లు కొనుగోలు చేయనిదే వారి గ్రామాలకు వెళ్ళరు. జాంగిర్, మైసూర్ పాక్, బాదుషా, తీయకారాలు, మిచ్చెర, తీయని బెండ్లు, ఇలా మొదలైనవి అన్ని అమ్మకాలు జరుపుతున్నారు. దాదాపుగా 80 సంవత్సరాల నుంచి మహమ్మద్ రఫీ, వారి కుటుంబ సభ్యులు తత్తూరు జాతరలో ఇలా స్వీట్ షాపుల టెంట్లు వేసి, రకరకాల స్వీట్ అమ్మకాలు జరుపుతూ ఉన్నామని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తత్తూరు రంగనాథ స్వామి దర్శించుకొని స్వీట్ కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారని అమ్మకాలు బాగానే జరుగుతూ ఉన్నాయని తెలిపారు. పూర్వం నుంచి ఇక్కడే మా వంశస్థులు స్వీట్ అమ్మకాలలో మా ప్రత్యేకత ఉంది.
2024-05-02T09:18:22Z
భద్రాద్రి రామాలయం హుండీ లెక్కింపు.. స్వామి వారి ఖజానాకు భారీగా విదేశీ కరెన్సీ !
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దేశంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు దేశ నలుమూలాల నుంచి రామభక్తులు నిత్యం భద్రాద్రి క్షేత్రానికి వస్తుంటారు. సీతారాముల వారిని దర్శించుకొని భక్తులు భక్తితన్మయత్వంలో పరవశిస్తారు. కాగా ఇటీవల నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సంధర్భంగా కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కాగా.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి 35 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను, హుండీ ఆదాయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి అధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపు అనంతరం భక్తుల కానుకల ద్వారా వచ్చిన హుండీల ఆదాయాన్ని అధికారులు ప్రకటించారు. మొత్తం రూ.13184181 లు ఆదాయం రాగా, విదేశీ కరెన్సీని సైతం భక్తులు కానుకల రూపంలో భారీగా సమర్పించారు. అందులో యూఎస్ డాలర్స్ 25, UAE ధీరమ్స్-55, సింగపూర్ డాలర్స్-2, ఇంగ్లాండ్ పౌండ్స్-10, థాయ్ లాండ్ - 20 భాట్, సౌదీ 17 రియాల్స్, మిశ్రమ వెండి 1.450 గ్రాములు, మిశ్రమ బంగారం 230 గ్రాములు హుండీలో భక్తులు కానుకలు సమర్పించారు.
2024-05-02T15:04:01Z