Trending:


పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు

పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు రైతు భరోసాపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించింది.  మొత్తం 69 లక్షల మంది లబ్ధిదారులకు గాను 65 లక్షల మందికి ఇది వరకే పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇది వరకే అందజేసింది. ఈ నెల 8వ తేదీ లోపు అందరికీ రైతు భరోసా వేస్తామని ఈ నె...


Haryana: మెజార్టీ కోల్పోయిన హర్యానా బీజేపీ సర్కార్.. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు

Haryana: హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నాయబ్ సింగ్ సైనీ సర్కార్ ప్రస్తుతం మెజారిటీని కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటివరకు మద్దతు ప్రకటించిన ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు.. తమ మద్దతును ఉపసంహరించుకుని.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. దీంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. ఈ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ...


హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?

హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.? లోక్ సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఈ క్రమంలోనే  జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కట్టారు. ప్రధాని మోదీ ఇవాళ(మే 7న) హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో  బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో మే 7న రాత్రి , మే 8న ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ...


వైభవంగా పోచమ్మ పండుగ బోనాలు.. ఎక్కడంటే..

పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతీయేడు వేసంగి పంటలు కోయగానే కొత్త ధాన్యంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుందని సంఘ సభ్యులు చెబుతున్నారు. పోచమ్మలను కొలిస్తే పాడి పంటలు చల్లగా ఉంటాయని మా ప్రగాఢ విశ్వాసం అన్నారు.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో హరిజనకుల సభ్యులు పోచమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల వారు సమయానుకూలంగా మే నెలలోనే పోచమ్మ పండగ నిర్వహిస్తారు. యాసంగి వరి పంట కోయగానే వచ్చిన...


హైదరాబాద్ - బెంగాల్ రైలును జీహాదీలు.. ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారా?

Claim: హైదరాబాద్ నుంచి బెంగాల్ వెళ్తున్న రైలును.. జీహాదీలు, ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.Fact: హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని వాడిలో ఉన్న హల్‌కట్టా షరీఫ్‌కు వెళ్లే యాత్రికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది.(newschecker.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)పచ్చని మసీదు గోపురం, బంగారు పక్షులతో అలంకరించిన రైలు వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది."హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లే రైలును జిహాదీలు ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు....


Hyderabad Metro: హైదరాబాద్‌లో భారీ వర్షానికి మెట్రో రైళ్లు నిలిచిపోయాయా?

హైదరాబాద్‌లో గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఈ భారీ వర్షానికి... జన జీవన అస్తవ్యస్తమయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో... హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. భారీ వర్షానికి కరెంట్ కూడా లేకపోవడంతో... మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని వార్తలు వచ్చాయి. ఇంకొంత మంది...


అహోబిలంలో ఘనంగా వసంతోత్సవాలు....

ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం సాక్ష్యాత్తు ఆ శ్రీ మహా విష్ణువు స్వయంబుగా ఉగ్రనరసింహ అవతారంలో వెలసిన క్షేత్రం అహోబిలం. అహోబిలం దేవస్థానంలో లక్ష్మి నరసింహాస్వామికి ప్రతి యేటా నిర్వహించే వసంతోత్సవం కనులపండువగా కొనసాగుతుంది. ఇటీవల అహోబిలం లక్ష్మినరసింహాస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా మరో నాలుగు రోజులపాటు స్వామి వారి వసంతోత్సవాలు జరగనున్నాయి.వసంతోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలం క్షేత్రంలో తిరుమంజన సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవాల సందర్భంగా అహోబిలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం మరోవైపు పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన అహోబిలంలో ఈ 5 రోజాలపాటు వసంతోత్సవాలు జరగనున్నాయి... అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి క్షేత్రంలో స్వామి వారి వసంతోత్సవం సందర్బంగా దిగువ అహోబిలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలకు తులసి దళం, కనకంబ్రాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అర్చకులు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవం సందర్భంగా 2వ రోజులో భాగంగా దిగువ అహోబిలం ఆలయంలో సాంప్రదాయ పద్దతిలో సంగీత కచేరి నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయానికి వచ్చిన భక్తులను ప్రత్యేకంగా ఈ సంగీత కచేరి ఆకట్టుకుంది


Gold Jewels: నడిరోడ్డుపై బోల్తా పడ్డ బంగారంతో వెళ్తున్న కంటైనర్.. క్వింటాళ్ల కొద్ది ఆభరణాలు

Gold Jewels: బంగారంతో వెళ్తున్న ఓ కంటైనర్ బోల్తా పడింది. అయితే అందులో అంతా ఇంతా కాదు క్వింటాళ్ల కొద్ది బంగారం ఉంది. కంటైనర్ బోల్తా పడటంతో అందులో ఉన్న డ్రైవర్, సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ బంగారం విలువ వందల కోట్లు ఉండటంతో ఎక్కడ ఎవరు ఎత్తుకెళ్లిపోతారో అనే భయాలు నెలకొన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే?


AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..?

AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?


పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. ఎన్నికల సంఘం కీలక సూచనలు

ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. అక్కడక్కడా అవాంతరాలు కూడా కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీలక వివరాలు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌కు సంబంధించి ఇప్పటివరకూ 70 శాతం పోలింగ్ పూర్తైందన్నారు. అవసరమైతే మే 9వ తేదీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.


దారుణం.. భార్య ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఐసీయూలోనే చంపేసిన భర్త

అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన భార్యను కాపాడుకోవడం మానేసి.. ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన తర్వాత.. చికిత్సకు అయిన డబ్బులు కట్టలేక ఆమె ప్రాణాలను తనే స్వయంగా తీసేశాడు. ఈ ఘటనను పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఆస్పత్రి మెడికల్ బిల్లులు చెల్లించలేక.. భార్యను చంపుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ దారుణ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


కుల వృత్తి ఒక వైపు.. అర్చక వృత్తి మరో వైపు.. ఇతని గురించి తెలుసుకోవాల్సిందే..!!

కుల వృత్తి ఒక వైపు.. అర్చక వృత్తి మరో వైపు.. ఇతని గురించి తెలుసుకోవాల్సిందే.. వారి కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల పదవ తరగతి లోనే చదువును ఆపివేసి తన కులవృత్తిని ఎంచుకొని తన తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం తల్లి సింగిరాల అనసూర్య తండ్రి సింగిరాల ఎల్లయ్య గారి ప్రథమ పుత్రుడు నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సింగిరాల శ్రీనివాస్. చిన్నప్పటి నుంచి తన తండ్రి నేర్పించిన సంస్కారంతో ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడై 8వ తరగతి నుంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ గురువుల దగ్గర ఇంకా విలువైన గ్రంథాలకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ వాటికీ ఆకర్షితుడై గురువులు సూచించిన మార్గంలో నడుచుకునేవాడు. వారి కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల పదవ తరగతి లోనే చదువును ఆపివేసి తన కులవృత్తిని ఎంచుకొని తన తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అదే సమయంలో ఒక దేవాలయం కు వెళ్ళినప్పుడు నీవు ఒక నాయి బ్రాహ్మణుడు గర్భగుడిలోనికి రావద్దు నీకు జంజరం లేదని ఒక దగ్గర తను అవమానానికి గురయ్యాడు. ఈ అవమానం తనని చాలా కలచివేసింది. అప్పుడే తాను మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. తాను అర్చకుడిగా కొనసాగాలని.. చిన్నప్పటి నుండి నేర్చుకున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు పంచుకోవాలని ఏదైనా మనం పట్టుదలతో సంస్కారవంతంగా ఉంటే సాధించాలని, తపన ఉంటే కచ్చితంగా సాధిస్తామని మనసులో దృఢంగా అనుకున్నాడు. అలాంటి సమయంలో ఒక గురువు వీరి లోపల ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తించి కుల మతాలకు అతీతంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జన్మనా జయతే శుద్రః కర్మణా జయతేజః ద్విజహ అనే శ్లోకం ఆధారంగా పరమాత్మ చెప్పిన సూక్తులతో అతనికి దేవాలయంలో అవకాశం కల్పించినారు. అప్పటినుండి తనకు ఉన్న జ్ఞానంతో ఎన్నో కీర్తి ప్రతిష్టలను సంపాదించి ఆ దేవాలయంలో అర్చకుడి కొనసాగుతున్నారు. అర్చకుడిగా కొనసాగుతున్న సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది రావడంతో దేవాలయంలో పూజలు చేస్తూ తన షాప్ కు వెళ్లి తన నాయి బ్రాహ్మణ వృత్తిని చేసేవారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు తన ప్రతిభను గుర్తించి అవార్డులు కూడా ప్రకటించారు. తనకు ఇతర సంస్థలో మంచి అవకాశాలు లభించినా తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని తిరస్కరించాడు. తన జీవిత ఆశయాలు ఏమిటని లోకల్ 18 ప్రతినిధి కేశవేణి ప్రవీణ్ అడగ్గా భూమ్మీదికి వచ్చిన ప్రతి మనిషి కి ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. మనం నిష్టతో ఉంటే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. మనిషి కష్టపడితే దేనినైనా పొందగలడని వివరించారు.


YS Sharmila Case: వైఎస్‌ షర్మిలకు షాక్‌.. వివేకా హత్య వ్యాఖ్యలపై కేసు నమోదు

Case Filed Against YS Sharmila In Badvel: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రధానంగా తన బాబాయి వైఎస్‌ వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా బద్వేలులో ఆర్‌వో ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు నమోదైంది. హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు అందింది.


ప్లీజ్ మా దేశానికి రండి..భారత్ ను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదేశ ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. భారతీయులు మళ్లీ మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ అభ్యర్థించారు.[caption id="" align="alignnone" width="1024"] పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గతేడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది.[/caption] మాల్దీవులలో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.


హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  హైదరాబాద్ లోని  బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.  అక్కడినుంచి నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్న మోదీ.. రేపు (బుధవారం) ఉదయం వేములవాడకు వెళ్లనున్నారు.  ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నార...


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు శుభ ముహూర్తం ఎప్పుడు? ఏ నగరంలో ఏ సమయంలో బంగారం కొనాలో తెలుసా?

Akshaya Tritiya 2024 Shubh Muhurat: మే 10న అక్షయ తృతీయ రాబోతుంది. ఇలాంటి పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది. బంగారం వంటిది ఈ రోజున కొంటే.. ఇంట్లో అంతులేని సంపదకు హామీ ఇస్తుందని నమ్ముతుంటారు. అక్షయ అంటేనే అంతులేనిది అని అర్థం. అయితే అక్షయ తృతీయ రోజున మంచి ముహూర్తం ఎప్పుడు ఉంటుంది.. ఏ నగరంలో ఎప్పుడు బంగారం కొనాలి అనేది తెలుసుకుందాం.


కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారు: రఘునందన్ రావు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి సంగారెడ్డిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్.. ర్యాలీ అనంతరం మాట్లాడుతూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అయోధ్యలో నిర్మించిన రామాలయం స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదు కడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు

సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు వర్షం కారణంగా సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు అయింది. అయితే యథావిధిగా సీఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ పర్యటన కొనసాగనుంది.  ఈ విషయాన్ని  అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి.  వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలలో ఆయన పాల్గొన...


పనిమనిషి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్‌‌లో.. ఈడీ అధికారుల సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఆరు కౌంటింగ్ మెషీన్ల సాయంతో లెక్కించగా.. ఆ ఫాట్లో ఉన్న నగదు రూ.32 కోట్లు అని తేలింది. అనుమానం వచ్చి మరో రెండు చోట్ల సోదాలు నిర్వహిస్తే.. మరో రూ.3 కోట్ల నగదు దొరికింది. ఈ డబ్బంతా దొరికింది ఓ పనిమనిషి ఇంట్లో కావడం గమనార్హం. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్‌ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్‌ లాల్‌ పని మనిషి జహంగీర్‌ ఆలం డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌లో ఈడీ అధికారులు ఈ సోదాలు జరిపారు.


Kejriwal Bail: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు జైలులో ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేయడానికి వారు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు ఆంక్షలు విధించింది. ఒక వేళ మధ్యంతర బెయిల్ వస్తే.. సీఎంగా అధికారిక విధులు...


రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క కొత్తగూడ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పోరిక బలరాం నాయక్‌‌‌‌కు మద్దతుగా సోమవారం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుంజేడు నుంచి కొత్తగూడ వరకు ...


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు ద...


Amavasya: రేపు అమావాస్య.. ఈ మూడు రాశులవారికి దశ తిరుగుతోంది..!

వైదిక పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని అమావాస్య రేపు అంటే మే 8, మంగళవారం. పంచాంగ్ ప్రకారం, వైశాఖ మాసం అమావాస్య ఈ రోజు రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. ఇది రేపు ( బుధవారం) రాత్రి 8:41 గంటలకు ముగుస్తుంది. కానీ హిందూమతంలో రోజు ఉదయ తిథితో ప్రారంభమవుతుంది, కాబట్టి వైశాఖ అమావాస్య రేపు మే 8 న ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య నాడు ఎన్నో అరుదైన యోగాలు జరుగుతున్నాయి. అమావాస్య రోజున ఈ సంయోగం సంభవించడం భూమిపై ఉన్న అన్ని జీవులపై ప్రభావం చూపుతుంది....


భద్రాద్రిలో ఈ భక్తులు చేసిన సేవలు వెలకట్టలేనివి.. తప్పక తెలుసుకోండి..

భద్ర మహర్షి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పూర్వం నుంచి అనేక మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొని తమ జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు.‌ వారిలో ముఖ్యంగా భద్ర మహర్షి, పోకల దమ్మక్క, భక్త రామదాసు, తానిషా, తూము లక్ష్మీనరసింహదాసు ప్రధానమైన వారిగా చెప్పుకోవచ్చు.‌ రామ దర్శనం కోసం కఠోర తపస్సును చేసే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని రామ అవతారంలో దర్శించుకున్న మహా భక్తుడు భద్ర మహర్షి. ఆయన కోరిక మేరకు శ్రీమన్నారాయణ రామ అవతార అనంతరం తిరిగి చతుర్భుజాలతో భద్రాచల క్షేత్రంలో సాక్షాత్కరించారు. భక్తుడైన భద్రుడిని శిలగా మార్చి శిరస్సుపై వెలిశారు. భద్రుని తపస్సు ఫలితంగానే భద్రాద్రి క్షేత్రం ఆవిర్భవించినట్లు పురాణ గ్రంథాలలో సైతం తెలుపబడుతుంది. అందుకే భద్రుడు భద్రాద్రి ఆలయంలో ప్రథమ భక్తుడుగా పేర్కొనవచ్చు. పోకల దమ్మక్కపోకల దమ్మక్క16వ శతాబ్దంలో పుట్టలో ఉన్న రాముడిని పోకల దమ్మక్క చూడటం జరిగిందని భద్రాద్రి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ మహా భక్తురాలు ప్రతి నిత్యం స్వామి వారికి అడవిలో లభించే ఫలాలను నైవేద్యంగా సమర్పించేది.ఈ క్రమంలో ఆమె రాముని పాదాలను కడిగేది. ప్రస్తుతం ఆలయం నిర్మించిన ప్రాంతంలో రాములవారు వెలిశారని మొట్టమొదటిగా ఈ లోకానికి చాటి చెప్పిన మహిళ పోకల దమ్మక్క.‌ అందుకే భద్రాద్రి రాముని సేవలో తరించిన మహా భక్తురాలుగా పోకల దమ్మక్క చరిత్ర ఎక్కింది. కంచర్ల గోపన్న ( భక్త రామదాసు )పూర్వం హస్నాబాద్ ప్రాంతంలో అంతర్భాగమైన భద్రాచలం అంతర్భాగంగా ఉండేది.‌ ఈ క్రమంలో హస్నాబాద్ ప్రాంతానికి తహసీల్దార్ గా వచ్చిన కంచర్ల గోపన్న అనంతరం భద్రాద్రి రామునికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి... ప్రభుత్వ సొమ్ముతో సుమారు ఆరు లక్షల వెండి నాణాలను వెచ్చించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించడమే కాకుండా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పలు బంగారు ఆభరణాలను సైతం చేసి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందుకే నేటికీ భద్రాద్రి అంటే భక్త రామదాసు గుర్తుకొస్తారు. అందుకే రామదాసుని సైతం మహా భక్తుడుగా పేర్కొనవచ్చు. తానిషా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తానీషా రామచంద్ర మహాప్రభు వారి దివ్యదర్శనాన్ని పొందిన మహనీయుడు.‌ నాడు భక్తరామదాసును బందీఖానాలో బంధించిన అనంతరం రామోజీ, లక్ష్మోజీలుగా రామ లక్ష్మణులు వెళ్లి తానీషాకు దర్శనమివ్వడం, 6 లక్షల బంగారు రామమాడాలు ఇచ్చారు. దీంతో ఏ సంప్రదాయస్తుడైనా రాముని సాక్షాత్కరం పొందడంతో తానీషా శరీరమంతా పవిత్రమైంది. రాముని కటాక్షంతో పూర్తిగా స్నానం చేయబడి పూర్వజన్మ సుకృతం వలన చరిత్రలోనే ఎంతో ఘన కీర్తిని సాధించారు. రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు భక్త రామదాసు తర్వాత భద్రాద్రి ఆలయం ఎన్నో ఒడిదుడుకులప ఎదుర్కొంటున్న సమయంలో తన యావదాస్తిని ఆలయ ఉద్ధరణకు కేటాయించి ఆలయాన్ని అభివృద్ధిపథంలో నడిపి రామదాసు ఆశయాలను రాజా తూము లక్ష్మీనరసింహదాసు నెరవేర్చారు. ఆగమ, వైష్ణవ సంప్రదాయాలను కొనసాగించి పది రకాల ఉత్సవాల సంకీర్తనలతో ఆరాధనలు జరిగేటట్లు చేశారు. ఈ ఐదుగురు భక్తుల విశేష సేవల వలన భద్రాద్రి ఆలయం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు.


ఏపీలో పథకాల అమలుకు అడ్డు తగులుతున్నది మీరంటే మీరంటూ.. పార్టీల విమర్శల జోరు !

ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక.. ప్రవేశపెట్టిన పథకాలు కాదు. మొన్నటి మొన్న అమలు చేసిన పథకాలు కానే కాదు.. కానీ ఇదేందయ్యా మీ గోల అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం వైసిపి ప్రవేశపెట్టిన పథకాలు సామాన్య ప్రజానీకానికి చేరకుండా.. టిడిపి అడ్డుతగులుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ తాము ఎన్నికల నియమావళి మేరకే ఈసీ కి ఫిర్యాదులు ఇస్తున్నట్లు మరో వైపు టిడిపి చెబుతోంది. ఇది ఏపీలో ఎన్నికల సంధర్భంగా ఉన్న అనిశ్చితి.వైసిపి ప్రభుత్వ...


కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్


వైఎస్ జగన్ గురించి పులివెందుల ప్రజలు ఏమంటున్నారు?

వైఎస్ జగన్ గురించి పులివెందుల ప్రజలు ఏమంటున్నారు?


స్విట్జర్లాండ్‌లో అషు రెడ్డి.. చలిలో సెగలు రేపుతోంది!

ఈ సమ్మర్‌ని అషురెడ్డి స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇండియాలో ఎండల దెబ్బకి తట్టుకోలేక అక్కడ రిలాక్స్ అవుతోంది.


గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు

గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.  పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మపురి,పెద్దపల్లి,మంథని, నియోజకవర్గాల్లో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట...


చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా..? గరుడ పురాణం ఏం చెబుతోంది?

భూమి మీద మరణం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో పుట్టిన వాళ్లు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, ఈ భూలోకంలో తన జీవనయానం ముగించుకుని భౌతిక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మరణానంతరం ఆ వ్యక్తి జ్ఞాపకాలు, వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనతో ఉంటాయి. భూమిపై జీవించి ఉన్నప్పుడు అందరూ మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి భౌతిక వస్తువులను ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. చనిపోయిన...


భూముల నుంచి ఆ ఇద్దరు రైతుల్ని ఖాళీ చేయించొద్దు : హైకోర్టు

భూముల నుంచి ఆ ఇద్దరు రైతుల్ని ఖాళీ చేయించొద్దు : హైకోర్టు భూసేకరణ ప్రక్రియ జరుపుకోవచ్చు ట్రిపుల్ ఆర్ భూసేకరణపై ఎన్​హెచ్ఏఐకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్‌‌‌‌(టిపుల్ ఆర్) ఉత్తర దిశ నిర్మాణంలో భూమి కోల్పోతున్న ఇద్దరు రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు పిటిషనర్లను వాళ్ల భూముల నుంచి ఖాళీ చేయించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ...


13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల ముసలోడితో పెళ్లి.. ఎక్కడో తెలుసా?

Child Marriage: మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాలు ఏకమయ్యేదే పెళ్లి. ఈ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇంతటి అమోఘమైన ఘట్టాన్ని ఎవరైనా సంబరాలతో జరుపుకోవాలనుకుని కలలు కంటుంటారు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతురికి వివాహం జరిపించి మెట్టినింటికి సాగనంపాలని ఆశతో ఎదురుచూస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులకు తమ కూతురికి మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తారు. \ మరికొంతమంది వరుడు ఎలా ఉన్నా పర్వాలేదు కూతురి...


చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..

చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు.. తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని కొంపల్లి, నిజాంపేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, శే...


ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి తెలంగాణ  తడాఖా ఏంటో చూపిస్తం పెద్ద ఛాతీ ఉండడం కాదు, అందులో మనసు ఉండాలని ప్రధానిపై ఫైర్​ హైదరాబాద్, వెలుగు: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్ ...


మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన 9 దేవాలయాలు.. వెయ్యి జన్మల పుణ్యం దక్కుతుంది..

భారతదేశం గొప్ప చరిత్ర, మతపరమైన సంప్రదాయాలు, అనేక కథలు, ఇతిహాసాలకు పుట్టినిల్లు. దేశంలో చాలా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలు కొలువుదీరాయి. ఈ పవిత్ర స్థలాలు భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. భక్తులకు, సందర్శకులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలందరూ తప్పక సందర్శించాల్సినవి 9 ఉన్నాయి. అవేంటంటే..* శ్రీ రామ జన్మభూమి...


నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బలమైన పోటీదారులు ఎవరూ లేరని.. తన గెలుపు చాలా సులభమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కొండా. అయితే.. తన గెలుపు అంత సులువు కావడానికి కాంగ్రెస్ పార్టీ చాలా హెల్ప్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


తిరుమల తరహాలో తిరుపతిలోనూ ఉచితంగా నిత్యాన్నదానం.. ఎక్కడెక్కడంటే?

తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తైన తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. అలాగే శ్రీవారి పాదాల చెంత కొలువైన తిరుపతిలోని నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమలలోని పలుచోట్ల యాత్రికులు, భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది.


బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​

బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​ నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్, వెలుగు:  బీజేపీలో పైరవీలకు చోటు లేదని పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, రైతులతో అర్వింద్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆ...


తెలంగాణలో పంటనష్టానికి 15.81 కోట్లు రిలీజ్

తెలంగాణలో పంటనష్టానికి 15.81 కోట్లు రిలీజ్ ఎకరానికి రూ.10 వేల చొప్పున 10  జిల్లాల్లోని  15,246 మంది రైతులకు పరిహారం   జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కారు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగానికి రూ.15.81 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర సర్కారు రిలీజ్​ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్చి నెలలో 4 రోజుల...


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌

జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌ జైశెట్టి రమణయ్యకు పుస్తకాలు  అందజేసిన మాజీ సీఎం  ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు జగిత్యాల టౌన్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాలకు వచ్చారు. ఈ క్రమంలో తనకు ఇంటర్​లో గురువైన ప్రముఖ కవి, రచయిత జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొన్ని పుస్...


కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లోని మంజేశ్వరం దగ్గర కారును ఢీకొట్టింది అంబులెన్స్. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురుకి గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. తర్వాత క్రేన్ సాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పో...


Fact Check: ఓటింగ్ సమయంలో ఒకే వ్యక్తి బీజేపీ అభ్యర్థికి 5 ఓట్లు వేశారా? వీడియో వైరల్..!

ఓటింగ్ సమయంలో ఒకే వ్యక్తి బీజేపీ అభ్యర్థికి 5 ఓట్లు పడ్డాయా? లేదు, వైరల్ వీడియో మాక్ పోల్‌కి సంబంధించినదిఓటింగ్ సమయంలో, ఒక వ్యక్తి ఈవీఎంలో బీజేపీ అభ్యర్థికి వరుసగా ఐదు ఓట్లు వేశారు . X-పోస్ట్ ఆర్కైవ్‌ను ఇక్కడ వీక్షించండి .వాస్తవం: "ఓటింగ్ ఫ్రాడ్", "అదే వ్యక్తి ద్వారా BJP అభ్యర్థికి 5 ఓట్లు" అనే కీవర్డ్‌లతో న్యూస్‌చెకర్ మొదట గూగుల్‌లో శోధించాడు. ఫలితంగా మేము ఏప్రిల్ 28, 2024న News9 ప్రచురించిన నివేదికను కనుగొన్నాము . ఈ వీడియో అస్సాంలోని...


రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల

Rangampeta Check Post Cash Seized: రంగంపేట సమీపంలో రామేశంపేట దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ వాహనంలో డబ్బులు దొరికాయి. అయితే ఓ డాక్యుమెంట్ చూపించగానే ఆ డబ్బుల్ని విడుదల చేశారు.


AP Traffic Alert: విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా

Vijayawada Pm Modi Tour Red Zone: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ మోదీ బందరురోడ్డులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగుతుంది. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు రోడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో పాటు మోదీ పర్యటన జరిగే...


మునుగోడుకు రావడమంటే.. నా నియోజకవర్గానికి వెళ్లినట్టే : భట్టి విక్రమార్క

మునుగోడుకు రావడమంటే.. నా నియోజకవర్గానికి వెళ్లినట్టే : భట్టి విక్రమార్క మునుగోడు నియోజకవర్గానికి  రావడం అంటే తన సొంత నియోజకవర్గం మధిర నియోజకవర్గానికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నమ్మిన వ్యక్తి కోసం ఏ స్థాయికైనా వెళ్లి కొట్లాడ గల వ్యక్తి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో...


ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్ నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చి...


Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో వారం కస్టడీ విధించింది కోర్టు. ఈ నెల 14 వరకు ఆమె జైలులోనే ఉండనున్నారు. అయితే ప్రజల్వ్ రేవణ్ణను దేశం దాటించారని, తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు.


హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తరచూ పవర్ కట్స్ ఉంటున్నాయి. ఎండల తీవ్రత పెరిగి విద్యుత్ డిమాండ్ పెరగటంతో ఓవర్ లోడ్ కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.


తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి

తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి అన్నదాతల అకౌంట్లలో రెండో విడత డబ్బులు జమ 5 ఎకరాలకుపైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం  7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలోకి పడిన పైసలు రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా 6.65 లక్షల మంది రైతులకు రూ.2,423 కోట్ల నిధులు హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...